పెద్దపల్లి : జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో కందుల కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రారంభించారు.
తెలంగాణ ప్రభుత్వం మార్కుఫెడ్ ద్వారా KDCMS వారి ఆధ్వర్యంలో కందుల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మె్ల్యే మాట్లాడుతూ..రైతుల సౌకర్యార్థం తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తుందన్నారు.
రైతులు దళారులకు అమ్మకుండా కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి లాభాలు పొందాలన్నారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, మార్కెట్ కమిటీ చైర్మెన్ శంకర్ నాయక్, వైస్ చైర్మెన్ జడల సురేందర్, తదితరులు పాల్గొన్నారు.