పెద్దపల్లి : పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు.
బుధవారం జిల్లాలోని జూలపల్లి మండల కేంద్రంలో పెద్దపల్లి పట్టణానికి గొట్టె హన్మయ్య, అతని భార్య గొట్టె కొమురమ్మ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఓ కారు వారిని బైక్ను ఢీ కొట్టడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. రోడ్డుపై పడి ఉన్న వారిని చూసి అటువైపుగా వెళ్తున్న ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి క్షతగాత్రులను తన సొంత వాహనంలో దవాఖాను పంపించారు. సకాలంలో స్పందించి సాయమందించిన ఎమ్మెల్యేను పలువురు అభినందించారు.