పెద్దపెల్లి : జిల్లాలోని ఓదెల మండలంలో కల్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లు భారం కావొద్దనే సీఎం కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ఈ పథకాలు నిరపేదలకు వరంగా మారాయని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆయన వెంట అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.