పెద్దపల్లి : బతుకమ్మ పండుగను ప్రతి ఆడబిడ్డ సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి అన్నారు. ఆదివారం పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేట, ముత్తారం, రంగాపూర్ గ్రామాల్లో మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకునేందుకు బతుకమ్మ పండుగను రాష్ట్రమంతటా వేడుకలా జరపాలని, ఆడబిడ్డలకు చీరెలను పంపిణీ చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.