పెద్దపల్లి : అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. స్థనికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని మంథని మండలం భట్టుపల్లి గ్రామానికి చెందిన గుండ్ల శ్రీలత(34) అనే వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
కాగా, భార్యాభర్తలు ఇద్దరికి ఉదయం గొడవలు జరిగాయని, భర్త సదయ్య శ్రీలతను చంపినట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరిస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది. శ్రీలత మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.