పెద్దపల్లి, మార్చ్ 14(నమస్తే తెలంగాణ) : ముత్తారం మండలం సీతంపల్లి గ్రామానికి చెందిన గంట రాజా గౌడ్ కుమారుడు గంట మహేష్ గౌడ్ శుక్రవారం విడుదలైన గ్రూప్ 3 ఫలితాల్లో(Group 3 results) స్టేట్ 21వ ర్యాంకు సాధించాడు. రెండు రోజుల క్రితం విడుదలైన గ్రూప్ 2 ఫలితాలలో రాష్ట్ర వ్యాప్తంగా 143 ర్యాంక్ సాధించాడు. కాగా ఇంతకు ముందు కూడా గ్రూప్ 4 ఫలితాలలో విజయం సాధించి ప్రస్తుతం పెద్దపల్లి పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్నారు.
పట్టుదలతో సివిల్స్ ప్రిపేర్ అయిన మహేష్ గౌడ్ మొదటి దఫా లో సివిల్స్ రాకపోవడంతో గ్రూపులో విజయం సాధించారు. జేఎన్టీయూ కళాశాలలో మైనింగ్ ఇంజినీరింగ్ పూర్తిచేసిన మహేష్ గౌడ్ ఇంటర్మీడియట్ విద్యను మంథనిలో చైతన్య జూనియర్ కళాశాలలో చదివి ఇంటర్మీడియట్ లో జిల్లాలో ప్రథమ స్థానం సంపాదించారు. సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో ప్రిపేర్ అవుతున్నట్లు మహేష్ గౌడ్ తెలిపారు.