ముత్తారం : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి, అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు. గురువారం ముత్తారం మండలంలోని కేశనపల్లి గ్రామంలో ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు నూనె కుమార్ ఆధ్వర్యంలో పెద్దపల్లిలోని జడ్పీ చైర్మన్ కార్యాలయంలో చైర్మన్ పుట్ట మధు సమక్షంలో టీఆర్ఎస్ లో చేశారు. వారికి పుట్ట మధు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాఘువీర్సింగ్తోపాటు ముత్తారం ఎంపీపీ జక్కుల ముత్తయ్య, పీఏసీఎస్ చైర్మన్ గుజ్జుల రాజిరెడ్డి, కేశనపల్లి ఉపసర్పంచ్ తాత స్వప్నబాలు యాదవ్, నాయకులు రామగల్ల రాధారమేశ్, గాజుల శ్రీనివాస్, చిందం సదానందం, తిప్పని సతీశ్, తాత రాజు ఉన్నారు.