కోల్ సిటీ, జూన్ 23: రామగుండం లయన్స్ క్లబ్కు అనుబంధమైన గోదావరిఖని శతాబ్ది సంస్థాపన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ జిల్లా 320 జీ ఆధ్వర్యంలో క్లబ్ నూతన అధ్యక్షుడిగా మాచీడి మహేందర్ గౌడ్, కార్యదర్శిగా పైడా సాయికుమార్, కోశాధికారిగా కొండ శ్రీకాంత్ గౌడ్లు ప్రమాణ స్వీకారం చేశారు. క్లబ్ గవర్నర్ హనుమాండ్ల రాజిరెడ్డి ముఖ్యతిథిగా హాజరై క్లబ్ సభ్యులకు దిశా నిర్దేశం చేశారు.
సమాజ సేవలో అంకితభావంతో పని చేస్తూ లయన్స్ క్లబ్కు మరింత పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని క్లబ్ గవర్నర్ హనుమాండ్ల రాజిరెడ్డి ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో సంస్థాపన అధికారిగా డా.విజయ, మేడిశెట్టి గంగాధర్ వ్యవహరించారు.

విశిష్ట అతిథులుగా హాజరైన జోన్ చైర్మన్, ప్రతినిధులు తానిపర్తి విజయలక్ష్మీ, పీ. మల్లికార్జున్, కజంపురం రాజేందర్, సోమారపు లావణ్యలను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు రాజేశ్వర రావు, చంద్రమౌళి, అమరేశ్వర రావు, బుచ్చిరెడ్డి, శ్రీనివాస రెడ్డి, గోపాల్ రెడ్డి, రాజిరెడ్డి, సాయికృష్ణ, అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.