పెద్దపల్లి : సింగరేణి సంస్థ ఆర్.జి త్రీ పరిధి ఓసిపి- 2 ఓబీలో కార్మికుడిగా పనిచేస్తున్న రామగిరి మండలం నాగపల్లికి చెందిన వేగోలపు సారయ్య (45) చికిత్స పొందుతూ మృతి చెందాడ. ఇటీవల కంపెనీలో విధులు నిర్వహిస్తుడగా గ్రేడర్ ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. కాగా, కరీంనగర్లోని ప్రైవేట్ దవాకానలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడికి తండ్రి లక్ష్మీ నరసయ్య, తల్లి లక్ష్మి, భార్య మహేశ్వరి, కూతురు సుష్మ వున్నారు.