పెద్దపల్లి : డీజిల్, పెట్రోల్ రేట్ల పెంపుపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై వివిధ వర్గాల నుంచి వివిధ రూపాల్లో నిరసన వ్యక్తమవుతున్నది. తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి రామగుండం లారీ ఓనర్స్ అసోసియేషన్, డీసీఎం వ్యాన్ అసోసియేషన్, క్యాబ్ డ్రైవర్ అసోసియేషన్ ఇతర సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట మహాధర్నా చేపట్టారు. పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ధరలు తగ్గించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, డ్రైవర్లు పాల్గొన్నారు.