పెద్దపల్లిటౌన్ : అన్ని వర్గాలకు అండగా సీఎంఆర్ఎఫ్ పథకం నిలుస్తున్నదని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 79 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన రూ.33,13,800 విలువగల చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యమిస్తున్నదని అన్నారు. ఆపద సమయంలో, ప్రాణపాయస్థితిలో ఉన్న వారందరికీ ఈ పథకం ఎంతగానో దోహదపడుతున్నదన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు బండారి శ్రీనివాస్, అక్కపాక తిరుపతి, శ్రీగిరి శ్రీనివాస్, గజవెల్లి పురుషోత్తం, లక్ష్మణ్, తిరుపతిరెడ్డి, కౌన్సిలర్ భిక్షపతి పాల్గొన్నారు.