పెద్దపల్లి : సీఎం కేసీఆర్ వీరాభిమాని ఉప్పు రాజ్ కుమార్ మరోసారి సీఎం కేసీఆర్ పట్ల తన అభిమానాన్ని చాటుకున్నాడు. జిల్లా కేంద్రానికి చెందిన రాజ్ కుమార్ రాఖీ పౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ భారీ కటౌట్లను ఇంట్లో ఏర్పాటు చేసి కుటుంబ సభ్యులతో రాఖీలు కట్టించి తన అభిమానాన్ని చాటుకున్నాడు.
కేసీఆర్, కేటీఆర్ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని, ఈ రక్షాబంధన్ వారి కుటుంబాలకు రక్షణగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్ పాలనలో ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో జీవించాలని అభిలషించారు.