ఓదెల, జూలై 14: శుభ్రత ఎక్కడ ఉంటుందో అక్కడి ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పేర్కొన్నారు. పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమంపై ఓదెలలోని మల్లికార్జున ఫంక్షన్ హాల్లో మండలంలోని ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో గ్రామాల పరిశుభ్రతకు తీసుకున్న చర్యలు, హరితహారంలో నాటిన మొ క్క లు, వాటి సంరక్షణపై సభలో ఒక్కొకరినీ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా గ్రామాలను తీర్చిదిద్దాలని కోరారు. అందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు ఇంకా ఎక్కువ సమయం కేటాయించి పని చేస్తేనే స్వచ్ఛ పల్లెలుగా రూపుదిద్దుకుంటాయని సూచించారు. ప్రతి శుక్రవారం గ్రామాల్లో సామూహిక శుభ్రత జరిగేలా చూడాలని కోరారు. హరితహారంలో ప్రజలకు అవసరమైన పండ్ల మొక్కలను తాను సొంతంగా ఇస్తానని తెలిపారు. సమావేశంలో ఎంపీపీ కునారపు రేణుకాదేవి, సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల శ్రీనివాస్రెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు ఆళ్ల రాజిరెడ్డి, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ కావటి రాజుయాదవ్, వైస్ ఎంపీపీ పల్లె కుమార్గౌడ్, ఆకుల మహేందర్, ఎంపీడీవో సత్తయ్య, పీఆర్ ఏఈ జిన్నా సమ్మిరెడ్డి, అధికారులు వాజిద్, లతామంగేశ్వరి, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.
లక్ష పండ్ల మొక్కలు నాటడమే లక్ష్యం
సుల్తానాబాద్, జూలై 14 : మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఈ నెల 24వ తేదీన నియోజకవర్గంలో లక్షలాది పండ్ల మొక్కలు నాటడమే లక్ష్యం గా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి తెలిపారు. పల్లెప్రగతి, హరితహారంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. రెండు, మూడు రోజుల్లో పండ్ల మొక్కలను వచ్చేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. సమావేశంలో ఎంపీపీ పొన్నమనేని బాలాజీరావు, మున్సిపల్ చైర్పర్సన్ ముత్యం సునీతారమేశ్, విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ బుర్ర శ్రీనివాస్, ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు పురం ప్రేమ్చందర్రావు, మాజీ ఎంపీపీ అయిల రమేశ్, వైస్ ఎంపీపీ కోట స్వప్న రాంరెడ్డి, ఎంపీడీవో శశికళ తదితరులు పాల్గొన్నారు.
ఎలిగేడు, జూలై 14: ఎలిగేడు మధుర ఫంక్షన్హాల్లో సమీక్షా సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఇప్పటికీ పలుచోట్ల పల్లెప్రగతి పనులు నత్తనడకన నడుస్తున్నాయని చెప్పారు. ఎలిగేడులో అభివృద్ధి పనులు చేపడుతు న్న సర్పంచ్ సింధూజను అభినందించారు. ఇక్కడ జడ్పీ వైస్ చైర్పర్సన్ మండిగ రేణుక, ఎంపీపీ తానిపర్తి స్రవంతి, మండల ప్రత్యేకాధికారి తిరుపతిరావు, ఎలిగేడు విండో చైర్మన్ గోపు విజయభాస్కర్రెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మాడ కొండాల్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బైరెడ్డి రాంరెడ్డి, ఎంపీడీవో శ్రీనివాసమూర్తి, ఎంపీవో అనిల్రెడ్డి, ఈజీఎస్ ఏపీవో సదానందం, సుధాకర్, సర్పంచులు కావేరి, సౌమ్య, ఎలిగేడు పద్మశాలీ సంఘ గౌరవాధ్యక్షుడు సత్యనారాయణ ఉన్నారు.