Arrangements | సుల్తానాబాద్ రూరల్, జనవరి 23 : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నీరుకుళ్ల మానేటి రంగనాయక స్వామి ఆలయ ఆవరణలో జరిగే సమ్మక్క-సారలమ్మ జాతర ఏర్పాట్లను శుక్రవారం ఆర్డీవో గంగయ్య పరిశీలించారు. జాతర జరుగే ప్రదేశాన్ని పరిశీలించి, పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇక్కడి జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశాలు ఉన్నందున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లను చేసినట్లు తెలిపారు. పారిశుధ్య నిర్వహణ ఎప్పటికప్పుడు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు.
తాగునీరు, విద్యుత్ లైట్లు, భక్తులకు వసతులు, స్థాన ఘట్టాలు, క్యూలైన్ ద్వారా మోక్కులను చెల్లించుకునే విధంగా ఏర్పాట్లు చేయనున్నామని చెప్పారు. భక్తులకు మెరుగైన వసతులు కల్పించేందుకు అధికారులకు పలు సూచనలు సలహాలు అందించారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బషీరుద్దీన్, ఎస్ఐ చంద్రకుమార్, ఎంపీడీవో దివ్య దర్శన్ రావు, జాతర కమిటీ చైర్మన్ పొన్నం చంద్రయ్య గౌడ్, ఈఓ శంకరయ్య, సర్పంచ్ కాంపల్లి సతీష్, ఆర్ఐ వినోద్, కార్యదర్శి సునీత, జూనియర్ అసిస్టెంట్ ప్రవీణ్ రెడ్డి, జీపీవో శ్రీనివాస్, జాతర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.