పెద్దపల్లి రూరల్, అక్టోబర్ 3: సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితులవుతున్న వారంతా బీఆర్ఎస్లో చేరుతున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి అన్నారు. పెద్దకల్వలకు చెందిన పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులంతా మూకుమ్మడిగా ఆ పార్టీకి రాజీనామా చేశారు. జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్లో చేరగా వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పెద్దకల్వలకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు నర్ల అంజయ్య యాదవ్, చింతల సంతోష్, నర్ల బాపు, నర్ల శ్రీనివాస్, నర్ల కుమారస్వామి, నర్ల రవి, చింతల రవి, చింతల అజయ్, మనోజ్, సారయ్య, స్వామి, కుమార్, మల్లేశ్, రాకేశ్, శ్రీనివాస్, శ్రీకాంత్, జాఫర్, జమాల్, బ్రహ్మం, రాజేశం, నాగభూషణం బీఆర్ఎస్లో చేరారు.
కార్యక్రమంలో ఎంపీపీ బండారి స్రవంతీ శ్రీనివాస్గౌడ్, బీఆర్ ఎస్ మండల అధ్యక్షుడు మర్కులక్ష్మణ్, పెద్దపల్లి సింగిల్విండో చైర్మన్ మాదిరెడ్డి నర్సింహారెడ్డి, ఎంపీటీసీ జక్కుల రుక్కమ్మ,లక్ష్మినారాయణ, మార్కెట్ డైరెక్టర్ సలేంద్ర రాములుయాదవ్, గ్రామశాఖ అధ్యక్షుడు పెగడ శ్రీనివాస్ యాదవ్, నాయకులు నర్ల పోల్రాజ్యాదవ్, పర్స శంకర్, భయ్య కొమురయ్య యాదవ్లతో పాటు పలువురు పాల్గొన్నారు.
మండలంలోని 30 పంచాయతీలు ఉండగా ప్రస్తుతం 28 క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. క్రీడా ప్రాంగణాలకు సంబంధించిన స్పోర్ట్స్ కిట్ల ప్రభుత్వం పంపించగా వాటిని క్రీడా ప్రాంగణాల బాధ్యులకు అందజేయ నున్నట్లు పెద్దపల్లి ఎంపీడీవో తెలిపారు.
పెద్దపల్లి, అక్టోబర్ 3: అవయవ దానానికి ప్రజలు ముందుకు రావాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పిలుపునిచ్చారు. పెద్దపల్లిలోని అమర్చంద్ కల్యాణ మండపంలో సదాశయ ఫౌండేషన్ సంస్థ 15వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేత్ర, అవయవ, శరీర దానం చేసిన కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే సతరించారు. సదాశయ ఫౌండేషన్ సేవలను అవగాహన కార్యక్రమాలు అందరికీ స్ఫూర్తిని కలిగిస్తున్నాయని కొనియాడారు.
అనంతరం సదాశయ ఫౌండేషన్ వ్యవస్థాప అధ్యక్షుడు టీ శ్రావణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి సీహెచ్ లింగమూర్తి తదితరులు ఫౌండేషన్ చేస్తున్న సేవలు, జాతీయ, రాష్ట్ర స్థాయిలో సదాశయకు వచ్చిన అవార్డులు, ప్రశంసా పత్రాలపై వివరించారు. 108 మంది అవయవ దాతల కుటుంబాలు చేసిన త్యాగాలను కొనియాడారు. అవయవ దాతలకు నివాళులర్పించారు. కార్యక్రమంలో వైద్యులు సందీప్, డీ వెంకటస్వామి, సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డ్ మెంబర్ సానా రామకృష్ణారెడ్డి, గౌరవ అధ్యక్షుడు, ఎన్ రమేశ్, సలహాదారులు డాక్టర్ భీష్మాచారి, రమణారావుపాల్గొన్నారు.