పెద్దపల్లి, నవంబర్10: ‘కాంగ్రెస్కు యాభై ఏండ్లు అధికారమిస్తే ప్రజలకు చేసిందేమీలేదు. అభివృద్ధికి నిధులివ్వలేదు..ఇప్పుడు మళ్లీ గెలిపిస్తే ఉద్దరిస్తామంటూ ఊదరగొడుతున్నరు..ప్రజలు ఆలోచించాలి ఓటుతో ఆ పార్టీ డిపాజిట్ గల్లంతు చేయాలి’ అంటూ పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్రెడ్డి పిలుపునిచ్చారు. రెండు పర్యాయాలు నిండు మనుస్సుతో పెద్దపల్లి ప్రజలు ఆశీర్వదించారు. ఓదెలలోని శివాలయ యూత్ సభ్యులు శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్లో బీఆర్ఎస్లో చేరారు. వీరికి దాసరి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
అనంతరం మాట్లాడారు. సమైక్య పాలనలో తెలంగాణ అన్నింటా వెనుకబడిపోయిందన్నారు. ఈ పరిస్థితుల్లో అప్పటి ఉద్యమనేత కేసీఆర్ చావునోట్లో తలబెట్టి రాష్ర్టాన్ని సాధించారని చెప్పారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపారని కొనియాడారు. పదేండ్ల కింద పెద్దపల్లి ఎలా ఉన్నది? ఇప్పుడేలా ఉన్నది? అని ప్రజలు ఆలోచన చేయాలన్నారు. పెద్దపల్లిపై సీఎం కేసీఆర్కు అమితమైన ప్రేమ ఉందని, వేల కోట్లు ఇచ్చారని వెల్లడించారు.పెద్దపల్లి నుంచి మండలకేంద్రాలకు డబుల్రోడ్లు నిర్మించామన్నారు. గల్లీల్లో సీసీ రోడ్లు వేసుకున్నామన్నారు. మళ్లీ గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పచ్చిమట్ల శ్రీనివాస్, మార రవి కుమార్, కనికిరెడ్డి సతీష్, తీర్తాల కుమారస్వామి, చింతం మోగిలి, బుద్దె కుమార్, బుద్దె రామస్వామి, బుద్దె పోచెట్టి, బోడకుంట మహేందర్, పడాల మల్లయ్య, గోపతి ఎల్లయ్య, రేగుల స్వామి, కొండ్ర సారయ్య, రామినేని లక్ష్మణ్ పాల్గొన్నారు.
ఓదెల యూత్ నాయకులు మార చందు, గట్టు అరవింద్, భూసారపు రాకేష్, నాగపురి సిద్దూ, నాగపురి రాకేష్, కాసారపు రాజు, మార సాగర్, పోతుగంటి అజయ్, సూత్రాల నవీన్, తోట అనుదీప్, గుండేటి అజయ్, జీల ప్రవీణ్ కుమార్, మా చర్ల సాయి, మాచర్ల బన్నీ, పూదరి సిద్ధూ, ఆ శిష్, సాయి, బుడిగే సాయి, మండల షాలూం,సుల్తానా బాద్ మండలం భూపతిపూర్కు చెందిన కాంగ్రెస్ యూత్ లీడర్ కనకం శేఖర్ రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు పాల రామారావు, పార్టీ కన్వీనర్ లంక దాసరి రవి, నాయకులు పోచమల్లు, దేవ శ్రీనివాస్, స్వామి, పోచంపల్లి రాజు, తిరుపతి ఆధ్వర్యంలో గులాబీ కండువా కప్పుకున్నారు.