సైదాపూర్, నవంబర్ 16: బీఆర్ఎస్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని పార్టీ హుస్నాబాద్ అభ్యర్థి, ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ పేర్కొన్నారు. గురువారం మండలంలోని అమ్మనగుర్తి, గుండ్లపల్లి, నల్లానిరామయ్యపల్లి, గొడిశాల, బొమ్మకల్, గుజ్జులపల్లి, ఎల్లంపల్లి గ్రామాల్లో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, ప్రముఖ కళాకారుడు దరువు ఎల్లన్నతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో సతీశ్కుమార్కు మహిళలు మంగళహారులతో స్వాగతం పలికి, బొట్టుపెట్టి ఆశీర్వదించారు.
ఎమ్మెల్యే సతీశ్కుమార్ మాట్లాడుతూ, ఎన్నికల్లో ఓటు వేసి తనను ఆశీర్వదిస్తే నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తానన్నారు. ప్రచారంలో మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల్లో సతీశ్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే, నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తారన్నారు. కళాకారుడు దరువు ఎల్లన్న మాట్లాడుతూ, కాంగ్రెస్, బీజేపీ నాయకులు చెప్పే కల్లబొల్లి మాటలు నమ్మి మోసపోవద్దని, బీఆర్ఎస్తో తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు.
నల్లానితండాకు చెందిన సింగిల్విండో డైరెక్టర్ గుగులోతు లక్ష్మితో పాటు పలువురు యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరగా, ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ గులాబీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే సోమారం అనుబంధ గ్రామం బూడిదపల్లి నుంచి సుమారు 100మంది ఒగ్గు కళాకారులు బుధవారం రాత్రి హుస్నాబాద్లోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సోమారపు రాజయ్య, వైస్ ఎంపీపీ రావుల శ్రీధర్రెడ్డి, సింగిల్విండో చైర్మన్లు కొత్త తిరుపతిరెడ్డి,
బిల్ల వెంకటరెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కొండ గణేశ్, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి చెల్మల్ల రాజేశ్వర్రెడ్డి, సర్పంచులు మిడిదొడ్డి సరితారమేశ్, గుండేటి సునీతారాణీజయకృష్ణ, గాజర్ల సదానందం, మ్యాకల శిరీషాముకుందరెడ్డి, తొంట కాంతమ్మ, బర్మావత్ అక్షయాశ్రీనివాస్నాయక్, చింత లతాకుమారస్వామి, ఎంపీటీసీలు ఏరుకొండ ఇందిరాసుధీర్, గాజర్ల భాగ్యాఓదెలు, నాయకులు ముత్యాల వీరారెడ్డి, చిట్టి ప్రకాశ్రెడ్డి, ఎల్కపల్లి రవీందర్, ఏరుకొండ శ్రీనివాస్, గోనెల శ్రీనివాస్, ఈదులకంటి సంపత్, బర్మావత్ శంకర్నాయక్ పాల్గొన్నారు.