విద్యానగర్, అక్టోబర్ 4: దేవి నవరాత్రుల ముసుగులో కోల్కతాలో జాతిపిత గాంధీని అసురుడిగా చిత్రీకరించి అవమానించడంపై ఆగ్రహ జ్వాలలు చెలరేగాయి. అఖిల భారత హిందూ మహాసభ ఏర్పాటు చేసిన మండపంలో మహాత్ముడిని పోలిన బొమ్మను ఏర్పాటు చేయడంపై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. మంగళవారం కరీంనగర్లోని టవర్ సరిల్లో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు, వైశ్య నాయకుడు చిట్టుమల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.
వైశ్యులు, వ్యాపారులు పెద్ద సంఖ్యలో పాల్గొని గాంధీ చిత్రపటం వద్ద కొబ్బరికాయలు కొట్టి, నివాళులర్పించారు. విచ్ఛిన్నకర శక్తులు శాంతి సామరస్యాలకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్న తరుణంలో దేశంలో శాంతిని కాపాడాలని, సంక్షేమ పథకాలు పేదవారికి అందాలనే ఉద్దేశంతో ముందుకొస్తున్న సీఎం కేసీఆర్కు వైశ్యులు, వ్యాపారులు మద్దతు తెలుపుతున్నారని శ్రీనివాస్ పేర్కొన్నారు. కొమురవెల్లి వెంకటేశం, రాచమల్ల ఆంజనేయులు, బొల్లం శ్రీనివాస్, కాచం రాజేశ్వర్, తాటిపల్లి సుభాష్, రాచమల్ల భద్రయ్య, తాటిపెల్లి గణేశ్, తాటికొండ భాసర్, వంగల పవన్, కొలిపాక శ్రీనివాస్, వంగల రమేశ్, వైశ్యులు, వ్యాపారస్తులు పాల్గొన్నారు.