చిగురుమామిడి, జనవరి 11: లాభదాయకమైన ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలని ఎంపీపీ కొత్త వినీతాశ్రీనివాస్ రెడ్డి, జడ్పీటీసీ గీకురు రవీందర్, జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖల అధికారి బండారి శ్రీనివాస్ సూచించారు. బుధవారం మండలంలోని నవాబుపేట గ్రామంలో వ్యవసాయ, ఉద్యానవన, పట్టు పరిశ్రమల శాఖల ఆధ్వర్యంలో రైతుల వ్యవసాయ భూములు 10.35 ఎకరాల్లో 630 మొకలను నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆయిల్ పామ్ సాగును ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నదని చెప్పారు. మండలంలో మొదటిసారిగా నవాబుపేట గ్రామంలో ఆయిల్పామ్ మొకలను నాటినట్లు తెలిపారు.
మండలం జిల్లాలోనే ఆదర్శంగా నిలువాలని ఆకాంక్షించారు. మండలంలో ఇప్పటివరకు 175 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగుకు రైతులు దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. కార్యక్రమంలో సర్పంచ్ సుద్దాల ప్రవీణ్, ఎంపీటీసీ మంకు స్వప్న, కో ఆప్షన్ సభ్యుడు మక్బూల్ పాషా, సింగిల్ విండో చైర్మన్ జంగ వెంకటరమణారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు సాంబారి కొమురయ్య, ఆర్బీఎస్ గ్రామాధ్యక్షుడు జితేందర్ రెడ్డి, పట్టు పరిశ్రమ శాఖ ఉపసంచాలకుడు యతీందర్, హార్టికల్చర్ అధికారి బుర్ర మంజువాణి, ఏవో రంజిత్ కుమార్, ఫీల్డ్ ఆఫీసర్ ప్రవీణ్, ఏఈవో సాయికుమార్, వివిధ పార్టీల నాయకులు మంకు శ్రీనివాస్ రెడ్డి, అనుమాండ్ల సత్యనారాయణ, బోయినీ సది రైతులు పాల్గొన్నారు.