Rudrangi | రుద్రంగి, జూలై 17: ‘వర్షాలు సంమృద్ధిగా కురుపించు దేవుడా..’ అని వేడుకుంటూ రుద్రంగి మండల కేంద్రంలో ఆదర్శయూత్ ఆధ్వర్యంలో యువకులు శుక్రవారం కప్పతల్లి ఆట ఆడి ప్రత్యేక పూజలు చేశారు. కప్పలను సంచిలో ఉంచి సంచిని రోకలికి తగిలించి డప్పుచప్పుల్లతో గ్రామంలో ఇంటింటికి తిరిగారు. ఇండ్ల వద్దకు వచ్చిన వారికి గ్రామస్తులు బిందెలతో నీళ్లు పోస్తు వరుణుడు కరుణించాలని వేడుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటి వరకు చిరుజల్లులే తప్ప భారీ వర్షాలు కురవడం లేదని, కప్పతల్లి ఆట నిర్వహించి వరుణాదేవుడిని పూజిస్తే వర్షాలు కురిస్తాయని ప్రజల నమ్మకమన్నారు. వర్షాలు కురువాలని, పంటలు పండాలని వారు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆదర్శయూత్ సభ్యులు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.