వేములవాడ టౌన్, జనవరి 19: వేములవాడ రాజన్న ఆలయంలో గురువారం ఆక్టోపస్ సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు. భద్రతా చర్యల్లో భాగంగా ఆలయంలోకి ఉగ్రవాదులు, తీవ్రవాదులు చొరబడినప్పుడు వారి నుంచి భక్తులను ఎలా కాపాడాలి..? ఇదే క్రమంలో భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి..? అనే విషయాలపై అవగాహన కల్పిస్తూ మాక్ డ్రిల్ నిర్వహించారు.
ఇందులో ఆక్టోపస్ సిబ్బందితో పాటు 50 మంది పోలీసులు పాల్గొన్నారు. మాక్డ్రిల్ సందర్భంగా ఆలయం, ఆవరణలో చుట్టూ లైట్స్ ఆర్పి వేయడం, భక్తులను లోపలికి అనుమతించకపోవడంతో పట్టణ ప్రజలు, భక్తులు భయపడ్డారు. తర్వాత విషయం తెలుసుకొని హమ్మయ్య అనుకున్నారు.