సిరిసిల్ల టౌన్, నవంబర్ 1: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రతిష్టాత్మక సెస్(సహకార విద్యుత్ సరఫరా సంస్థ) ఎన్నికల నగారా మోగింది. ఈ మేరకు మంగళవారం తెలంగాణ కోఆపరేటివ్ ఎలక్షన్ అథారిటీ అడిషనల్ రిజిస్ట్రార్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. దీని ప్రకారం వచ్చే నెల 5న ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ప్రారంభం కానున్నది.
డిసెంబర్ 13, 14, 15 తేదీల్లో నామినేషన్ల స్వీకరణ, 16న నామినేషన్ల పరిశీలన, 17న ఉపసంహరణ, అభ్యర్థుల ప్రకటన, గుర్తుల కేటాయింపు ప్రక్రియ జరుగనున్నది. 24న ఎన్నికల నిర్వహణ, 26న ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలు విడుదల కానుండగా, 27న పాలకవర్గం పదవీ బాధ్యతల స్వీకరణ ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. సెస్ పరిధిలోని 11డైరెక్టర్ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.