రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శుక్రవారం నూలు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పట్టణంలోని శివభక్త మార్కండేయ ఆలయంలో ఉదయం ప్రత్యేక పూజలు చేసి మార్కండేయుడి రథయాత్ర నిర్వహించారు. పద్మశాలీలు, పురప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలిరాగా కోలాటాలు, నృత్యాల నడుమ శోభాయాత్ర కనులపండువగా సాగింది.
నేతన్న చౌరస్తా, ఆగస్టు 12: సిరిసిల్లలో శుక్రవా రం నూలు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మార్కండేయుడి రథయాత్రను వైభవంగా జరిపారు. సిరిసిల్లలోని శివభక్త మార్కండేయ ఆలయంలో ఉదయం ప్రత్యేక పూజలు చేశారు. గా యత్రీ మహాయజ్ఞం నిర్వహించారు. పట్టణంలోని పద్మశాలీలు నూతన యజ్ఞపవీతాన్ని ధరించారు. అనంతరం నిర్వహించిన మార్కండేయ శోభాయాత్ర కనుల పండువలా సాగింది. రథం వెనుక ప్రత్యేక వాహనంపై మగ్గం అమర్చి నేత నేసి ఉత్తరీయాన్ని తయారు చేయడం ఆకర్షణగా నిలిచిం ది. అంబేద్కర్ విగ్రహానికి మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ పూలమాల వేశారు.
అనంతరం నేత న్న విగ్రహానికి సైతం పలువురు నాయకులు పూలమాలలు వేశారు. వేడుకల్లో టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, నేతలు గూడూరి ప్రవీణ్, కౌన్సిలర్లు, పద్మశాలీ ప్రముఖులు లగిశెట్టి శ్రీనివాస్, గాజుల బాలయ్య, మండల సత్యం, మ్యాన రవి, యెల్లె లక్ష్మీనారాయణ, కోడం శ్రీనివాస్, పద్మశాలీ సంఘం అధ్యక్షుడు గోలి వెంకటరమణ, పద్మశాలీ యువజన సంఘం అధ్యక్షుడు గుండ్లపెల్లి పూర్ణచందర్, బొల్లి రామ్మోహన్, పద్మశాలీ మహిళా అధ్యక్షురాలు కాముని వనిత ఉన్నారు.