హుజూరాబాద్ మండలంలో పురుషులతో పోల్చితే మహిళా ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. ఇటీవల ఎన్నికల విభాగం అధికారులు ప్రకటించిన కొత్త ఓటరు జాబితాలో ఈ విషయం వెల్లడైంది. మండలంలో పురుష ఓటర్ల కన్నా 953 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నట్లు తేలింది. దీన్ని బట్టి చూస్తే రాబోయే ఎన్నికల్లో అభ్యర్థుల భవిష్యత్ మహిళలపైనే ఆధారపడి ఉందనడంలో సందేహం లేదు.
హుజూరాబాద్ మండలంలో 19 గ్రామాలు ఉండగా, 33,851 మంది ఓటర్గా నమోదయ్యారు. ఇందులో 16,449 మంది పురుషులు, 17,402 మంది స్త్రీలు ఉన్నారు. రాంపూర్ ఒకే ఒక్క గ్రామపంచాయతీలో మాత్రం 10 మంది పురుష ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ 1,333 మంది పురుషులు, 1,233 మంది మహిళలు ఓటరుగా నమోదయ్యారు. సిర్సపల్లిలో అత్యధికంగా మహిళా ఓటర్లు 155 మంది ఎక్కువగా ఉండగా, మొత్తం 2,595 మంది ఓటర్లలో 1,220 మంది పురుషులు, 1,375 మంది స్త్రీలు ఉన్నారు. చెల్పూర్లో మహిళా ఓటర్లు 148 మంది ఎక్కువగా ఉండగా, మొత్తం 4,304 మంది ఓటర్లలో 2,078 మంది పురుషులు, 2,226 మంది స్త్రీలు ఉన్నారు.
కందుగులలో మహిళా ఓటర్లు 139 మంది అధికంగా ఉండగా, మొత్తం 2,927 మంది ఓటర్లలో 1,394 మంది పురుషులు, 1,533 మంది స్త్రీలు ఉన్నారు. సిర్సపల్లిలో మహిళా ఓటర్లు 91 మంది ఎక్కువగా ఉండగా, మొత్తం 2,595 మంది ఓటర్లలో 1,220 మంది పురుషులు, 1,375 మంది స్త్రీలు ఉన్నారు. కనుకులగిద్దలో మహిళా ఓటర్లు 87 మంది ఎక్కువగా ఉండగా, మొత్తం 1,663 మంది ఓటర్లలో 948 మంది పురుషులు, 1,024 మంది స్త్రీలు ఉన్నారు. తుమ్మనపల్లిలో మహిళా ఓటర్లు 76 మంది ఎక్కువగా ఉండగా, మొత్తం 1,972 మంది ఓటర్లలో 2,078 మంది పురుషులు, 2,226 స్త్రీలు ఉన్నారు. కాట్రపల్లిలో మహిళా ఓటర్లు 52 మంది ఎక్కువగా ఉండగా, మొత్తం 1,448 మంది ఓటర్లలో 948 మంది పురుషులు, 770 మంది స్త్రీలు ఉన్నారు.
పోతిరెడ్డిపేటలో మహిళా ఓటర్లు 41 మంది ఎక్కువగా ఉండగా, మొత్తం 2,169 మంది ఓటర్లలో 1,064 మంది పురుషులు, 1,105 మంది స్త్రీలు ఉన్నారు. రంగాపూర్లో మహిళా ఓటర్లు 40 మంది ఎక్కువగా ఉండగా, మొత్తం 1,492 మంది ఓటర్లలో 726 మంది పురుషులు, 766 మంది స్త్రీలు ఉన్నారు. శాలపల్లి-ఇందిరానగర్లో మహిళా ఓటర్లు 39 మంది ఎక్కువగా ఉండగా, మొత్తం 1,539 మంది ఓటర్లలో 750 మంది పురుషులు, 789 స్త్రీలు ఉన్నారు. పెద్దపాపయ్యపల్లిలో మహిళా ఓటర్లు 29 మంది ఎక్కువగా ఉండగా, మొత్తం 2,673 మంది ఓటర్లలో 1,322 మంది పురుషులు, 1,351 మంది స్త్రీలు ఉన్నారు.
రాజపల్లిలో మహిళా ఓటర్లు 23 మంది ఎక్కువగా ఉండగా, మొత్తం 993 మంది ఓటర్లలో 438 మంది పురుషులు, 443 మంది స్త్రీలు ఉన్నారు. బొత్తలపల్లి గ్రామంలో మహిళా ఓటర్లు 14 మంది ఎక్కువగా ఉండగా, మొత్తం 398 మంది ఓటర్లలో 192 మంది పురుషులు, 206 స్త్రీలు ఉన్నారు. చిన్నపాపయ్యపల్లిలో మహిళా ఓటర్లు 11 మంది ఎక్కువగా ఉండగా, మొత్తం 613 మంది ఓటర్లలో 301 పురుషులు, 302 స్త్రీలు ఉన్నారు. జూపాకలో మహిళా ఓటర్లు ఎనిమది మంది ఎక్కువగా ఉండగా, మొత్తం 1,392 మంది ఓటర్లలో 692 మంది పురుషులు, 700 మంది స్త్రీలు ఉన్నారు. వెంకట్రావుపల్లిలో మహిళా ఓటర్లు ఏడుగురు ఎక్కువగా ఉండగా, మొత్తం 1,001 మంది ఓటర్లలో 497 మంది పురుషులు, 504 మంది స్త్రీలు ఉన్నారు. ధర్మరాజుపల్లిలో మహిళా ఓటర్లు ఇద్దరు ఎక్కువగా ఉండగా, మొత్తం 1,446 మంది ఓటర్లలో 722 మంది పురుషులు, 724 మంది స్త్రీలు ఉన్నారు. అత్యల్పంగా మందాడిపల్లి గ్రామంలో పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటరు ఒక్కరు ఎక్కువగా ఉండగా, మొత్తం 491 ఓటర్లలో 245 మంది పురుషులు, 246 మంది స్త్రీలు ఉన్నారు.