కమాన్చౌరస్తా/కరీంనగర్ రూరల్/కొత్తపల్లి/జమ్మికుంట/ చొప్పదండి/ మానకొండూర్/ రూరల్/ హుజూరాబాద్ రూరల్ / గంగాధర/ శంకరపట్నం/ చిగురుమామిడి / హుజూరాబాద్టౌన్/ తిమ్మాపూర్ రూరల్, ఫిబ్రవరి 28: సర్ సీవీ రామన్ జయంతిని పురస్కరించుకుని జిల్లాలోని విద్యాసంస్థల్లో బుధవారం సైన్స్డే ఘనంగా నిర్వహించారు. సీవీ రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాగా, నగరంలోని వావిలాలపల్లిలో గల అల్ఫోర్స్ సూల్ ఆఫ్ జెన్ నెక్ట్స్లో అల్ఫోర్స్ సైన్స్ కార్నివాల్ నిర్వహించగా, విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్ రెడ్డి ప్రారంభించారు. విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి.
బోయవాడలోని శ్రీ చైతన్య పాఠశాలలో సైన్స్ఎక్స్పో కార్యక్రమం నిర్వహించగా, ఎస్సారార్ విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి, ఏజీఎం రాజు, ప్రిన్సిపాల్ ఎన్ పద్మజా రెడ్డి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. వావిలాలపల్లిలోని శ్రీచైతన్య పాఠశాలలో వేడుకలను ఎస్యూ కెమిస్ట్రీ విభాగం హెచ్వోడీ డాక్టర్ నమ్రత, ప్రిన్సిపాల్ మానస ప్రారంభించారు. అలాగే, భగత్నగర్లోని భగవతి పాఠశాలలో సైన్స్ డేను చైర్మన్ రమణారావు, కరస్పాండెంట్ విజయలక్ష్మి ప్రారంభించారు. మంకమ్మతోటలోని సిద్ధార్థ పాఠశాలలో వేడుకలను విద్యాసంస్థల అకాడమిక్ డైరెక్టర్ శ్రీపాల్ రెడ్డి ప్రారంభించారు.
హనుమాన్నగర్లోని బ్లూబెల్స్ పాఠశాలలో విద్యార్థులు తయారు చేసిన ప్రదర్శనలను ప్రిన్సిపాల్ జంగ సునీత-మనోహర్ రెడ్డి పరిశీలించి, అభినందించారు. జాన్సన్ గ్లోబల్ పాఠశాలలో ‘అన్వేష్-24’ పేరిట నిర్వహించిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పాఠశాల చైర్మన్ మహిపాల్ రెడ్డి, డైరెక్టర్లు వరప్రసాద్, రాంరెడ్డి, సింహాచలం హరికృష్ణ, వంగల సంతోష్ రెడ్డి పాల్గొన్నారు. కరీంనగర్, అల్గునూర్లోని పారమిత విద్యాసంస్థల్లో సైన్స్ డేను విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ప్రసాద్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో విద్యాసంస్థల డైరెక్టర్లు, ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శనను ప్రధానోపాధ్యాయుడు లక్ష్మారెడ్డి ప్రారంభించారు. సెక్టోరియల్ అధికారి ఆంజనేయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పద్మనగర్లోని మానేరు పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ఫెయిర్ను విద్యాసంస్థల అధినేత కడారి అనంతరెడ్డి ప్రారంభించారు. విద్యాసంస్థల డైరెక్టర్ కడారి సునీతా రెడ్డి, ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. వాణీనికేతన్ పాఠశాలలో ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శనను డైరెక్టర్ రేణుక, ట్రస్మా ముఖ్య సలహాదారు యాదగిరి శేఖర్రావు ప్రారంభించారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది హన్మంతరావు, నీలకంఠం, సందీప్ జేసన్, అధ్యాపకులు పాల్గొన్నారు.
జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో మండల విద్యాధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సైన్స్ దినోత్సవానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాధికారి వీఎస్ జనార్దన్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు 100కు పైగా ఎగ్జిబిట్స్ ప్రదర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీఈవో మాట్లాడుతూ, విద్యార్థులను గొప్పగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయుల పనితీరును అభినందించారు. సైన్స్ ప్రదర్శనలతో విద్యార్థుల్లోని సృజనాత్మకత వెలుగులోకి వస్తుందన్నారు. కార్యక్రమంలో పట్టణంలోని 13 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల నుంచి వెయ్యి మంది విద్యార్థులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
చొప్పదండి మండలం రుక్మాపూర్ ఆదర్శ పాఠశాలలో ప్రిన్సిపాల్ రమేశ్, రేవెల్లి పాఠశాలలో హెచ్ఎం ఆనందం ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా సీవీ రామన్ చేసిన ప్రయోగాలను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే పరిశీలనాత్మక, ప్రయోగాత్మక, పరిశోధనాత్మక దృక్పథాన్ని పెంకోవాలని సూచించారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ములల కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మానకొండూర్లోని చాణక్య ఉన్నత పాఠశాలలో విద్యార్థులు 35 రకాల వర్కింగ్ మోడల్స్ తయారు చేసి, వాటి పనితీరును వివరించారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఆడెపు రవీందర్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
మానకొండూర్ మండలం ఊటూర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు 33 ప్రయోగాలను రూపొందించి ప్రదర్శించగా, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ సర్పంచ్ ఎనగందుల సుదర్శన్ వారిని అభినందించారు. అనంతరం సైన్స్ ఉపాధ్యాయులు భుజన్ చందర్, కిషన్ను ప్రధానోపాధ్యాయిని స్వరూపారాణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా సన్మానించారు. అలాగే దేవంపల్లి సోషల్ వెల్ఫేర్ కళాశాలలో ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ వైజ్ఞానిక దినోత్సవాన్ని నిర్వహించారు. హుజూరాబాద్ మండలం సింగాపూర్ వీఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు రూపొందించిన ప్రయోగాలను ప్రదర్శించగా, ప్రిన్సిపాల్ డాక్టర్ వీవీఎన్ హనుమ కుమార్, అధ్యాపకులు తిలకించి వారిని అభినందించారు.
వైజ్ఞానిక శాస్త్ర ప్రాముఖ్యతను ప్రిన్సిపాల్ విద్యార్థులకు వివరించారు. గంగాధర వివేకానంద లిటిల్ జీనియస్ పాఠశాలలో నిర్వహించిన సైన్స్ఫెయిర్కు ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి వేణుకుమార్ హాజరయ్యారు. విద్యార్థులు తయారు చేసిన సైన్స్ నమూనాలను పరిశీలించి అభినందించారు. పాఠశాల కరస్పాండెంట్ లక్ష్మారెడ్డి, ప్రిన్సిపాల్ ఉషారాణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. శంకరపట్నం మండలంలోని పలు పాఠశాలల్లో సైన్స్ డే సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు సీవీ రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మొలంగూర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు స్వయంగా తయారు చేసిన పలు వైజ్ఞానిక సంబంధిత ఎగ్జిబిట్స్ ప్రదర్శించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు వైజ్ఞానిక, క్విజ్ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో హెచ్ఎం నీరజ, ఉపాధ్యాయులు గీతారాణి, బాబు, శ్రీనివాస్, ఆదిలక్ష్మి, శారద, భాగ్యలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు. చిగురుమామిడి మండలం ఇందుర్తి జడ్పీహెచ్ఎస్లో విద్యార్థులు ఎగ్జిబిట్స్ రూపొందించి ప్రదర్శించగా, విద్యా కమిటీ చైర్మన్ ఆఫ్రిన్, పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు తిరుపతి, బ్యాంక్ అధికారులు తిలకించి వారిని అభినందించారు.
విద్యార్థులకు సైన్స్ క్విజ్ నిర్వహించారు. ఉపాధ్యాయులు మంజుల, తిరుపతి, రామలింగాచారి, ఓదెలు కుమార్, మాధవి, రఘుపతి రెడ్డి, పవన్ కుమార్, ఆరిఫ్ హుస్సేన్, సరిత, రమాదేవి పాల్గొన్నారు. హుజూరాబాద్ పట్టణంలోని వివేకవర్ధిని, విజ్ఞాన్ మాంటిస్సోరి, టెట్రా, శ్రీకాకతీయ పాఠశాలలో, మహాత్మా జ్యోతిరావు పూలే(బాలుర) పాఠశాలలో, జడ్పీహెచ్ఎస్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సైన్స్ ఫెయిర్ను ఎంఈవో కేవీ నర్సింహారెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్, ట్రస్మా స్టేట్ చీఫ్ అడ్వైజర్ యాదగిరి శేఖర్రావు, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు కోరెం సంజీవరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.
కార్యక్రమాల్లో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రసాద్, గీతాషాజు, కోటేశ్వర్, డైరెక్టర్ షాజుథామస్, హెచ్ఎంలు ఎస్ అనురాధ, మల్లెంపాటి శ్రీధర్, కొండబత్తిని శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తిమ్మాపూర్లోని శ్రీ చైతన్య పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించగా, ముఖ్యఅతిథిగా ఎంఈవో శ్రీనివాస్ రెడ్డి హాజరై తిలకించారు. ఏజీఎం రాజు, పాఠశాల ప్రిన్సిపాల్ రవీందర్ రెడ్డి, కోఆర్డినేటర్ ప్రవీణ్ కుమార్, విజయలక్ష్మి, నూరి, డీన్ విజయ్కృష్ణ, ఇన్చార్జిలు మమత, కృష్ణవేణి, ఏవో జ్యోతిరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.