Chigurumamidi | చిగురుమామిడి, సెప్టెంబర్ 4 : చిగురుమామిడి మండలం ఇందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన భాషబత్తిని ఓదెలు కుమార్ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. సెప్టెంబర్ 5 న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని జాతీయస్థాయిలో ఎన్వీ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి రాష్ట్రం (తెలంగాణ-ఆంధ్ర ప్రదేశ్ )లో విద్యా రంగంలో విశిష్ట సేవలు చేసిన ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రం నుండి భాషబత్తిని ఓదెలు కుమార్ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేశారు. ఓదెలు కుమార్ స్టేట్ రిసోర్స్ పర్సన్ గా వ్యవహరిస్తూ ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణలు చేస్తూ ప్రయోగాల ద్వారా పాఠ్యాంశాలను విద్యార్థులకు చైతన్యవంతులను చేస్తున్నారు.
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ సన్మానం ఈనెల 6 న (ఆదివారం) నెల్లూరు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినట్లు ఫౌండేషన్ ఛైర్మన్ లీలా కృష్ణ మోహన్ ఆహ్వానం పంపినట్లు ఓదెలు కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి విశ్రాంతి ఐఏఎస్ అధికారి లక్ష్మీకాంతం, మంగళ గిరి విద్యాధికారి శ్రీ బాబు పాల్గొంటారని తెలిపారు. ఈ అవార్డు ఎంపిక పట్ల మండల విద్యాధికారి జయప్రద, ఇందుర్తి, రేకొండ గ్రామాల సర్పంచ్లు సర్పంచ్ చింతపూల నరేందర్,ఆల్లెపు సంపత్, ఉపసర్పంచ్ అనిల్ కుమార్, సింగల్ విండో డైరెక్టర్ చాడ శ్రీధర్ రెడ్డి, జేఏఓ చాడ కవిత, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. కాగా ఓదెలు కుమార్ స్వగ్రామం చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలో జాతీయస్థాయి అవార్డు ఎంపిక పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.