రామడుగు(చొప్పదండి), మే 1: రామడుగు మండలం గోపాలరావుపేట అల్ఫోర్స్ పాఠశాల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో అద్భుత ప్రతిభ చూపారు. బొమ్మెన జాహ్నవి, కళ్లెం జాహ్నవి, గండ్ర అరవింద్, చాడ స్రావ్య నా రెడ్డి, వర్షిత, కుర్ర శ్రీమన్య, జూపాక సిరి చందన, మెరుగు స్నిగ్ధ ఎనిమిది మంది 10 జీపీఏ సాధించారని, మరో ఎనిమిది మంది విద్యార్థులు 9.8 జీపీఏ సాధించడమే కాకుండా పాఠశాల విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు విద్యాసంస్థల అధినేత నరేందర్రెడ్డి బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో తల్లిదండ్రులు, విద్యార్థిని విద్యార్థులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.