Nandimedaram | ధర్మారం, మే 18 : ధర్మారం మండలంలోని నంది మేడారం, ఖిలావనపర్తి, దొంగతుర్తి, రామయ్యపల్లి, చింతలపల్లి, ఎర్రగుంటపల్లి గ్రామంలోని కొనుగోలు కేంద్రాలను నందిమేడారం పాక్స్ చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి సోమవారం సందర్శించారు. కేంద్రాలలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఆయన అడిగి తెలుసుకొన్నారు. ముఖ్యంగా ఎర్రగుంటపల్లి గ్రామంలో లారీ ల కొరత లేకుండా సకాలంలో వచ్చేటట్లు మాట్లాడి సమస్య పరిష్కరించారు. కేంద్రాలలో తూకం చేసిన వరి ధాన్యం ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సిబ్బందికి ఆయన సూచించారు.
కేంద్రాలలో ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఆయన వారికి సూచించారు. ఆయన వెంట పాక్స్ వైస్ చైర్మన్ సామంతుల రాజ మల్లయ్య, ఖిలావనపర్తి సర్పంచ్ మోతె కనుకయ్య, దొంగతుర్థి మాజీ ఎంపీటీసీ దాడి సదయ్య, గోపాల్ రావు పేట ఉప సర్పంచ్ భారత స్వామి, డైరెక్టర్ దీటి శ్రీనివాస్, రచ్చ పల్లి ఉప సర్పంచ్ బైరి సురేష్, పార్టీ నాయకులు ఆవుల శ్రీనివాస్, ఆవుల వేణు తదితరులు పాల్గొన్నారు.