ధర్మపురి, మార్చి 2: రాజ్యసభ సభ్యుడు, ‘నమస్తే తెలంగాణ’ సీఎండీ దీవకొండ దామోదర్రావు మాతృమూర్తి ఆండాళమ్మ (80) శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్లోని నివాసంలో అనారోగ్యంతో స్వల్ప అస్వస్థతకు గురై, ఆమె కన్నుమూశారు. ఆమె మృతితో స్వగ్రామమైన బుగ్గారం మండలం మద్దునూర్లో విషాదం అలుముకున్నది.
బుగ్గారం బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు, ఎంపీటీసీ గాలిపెల్లి మహేశ్, నాయకులు రాచమడుగు సతీశ్రావు, ముంజాల సత్తయ్య, లింగాల లింగయ్య, మేడిపెల్లి మహేశ్తోపాటు పలువురు నాయకులు హైదరాబాద్ వెళ్లి ఆమె భౌతికకాయానికి నివాళులర్పించారు. జూబ్లీహిల్స్ రోడ్-8లోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.