‘నేను ఈ గడ్డ బిడ్డను. ఇక్కడే పుట్టిన. ఇక్కడే పెరిగిన. ప్రజల మధ్యలోనే ఉన్న. కష్టనష్టాల్లో తోడున్న. ఈ రోజు ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులంతా స్థానికేతరులే. ఎన్నికలు వచ్చాయని పగటివేషగాళ్ల మాదిరి మీ ముందుకు వస్తున్నరు. ఎంపీగా గెలిచి.. ఏ ఒక్క రోజు ఈ ప్రాంతానికి రాకుండా, ఒక్క రూపాయి పని చేయకుండా ఐదేండ్లు ముఖం చాటేసిన వ్యక్తి ఒకరైతే, ఓడిపోయి ఐదేండ్ల తర్వాత తిరిగివచ్చింది మరొకరు. ఇప్పుడు నాపై మాట్లాడుతున్న వాళ్లు కరోనా కాలంలో ఎక్కడున్నరు? వాళ్ల ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను ఎలాంటి వాడినో కోరుట్ల నియోజకవర్గంలో ఉన్న రెండులక్షల ముప్పై వేల మందికి తెలుసు. అప్పుడు సేవా కార్యక్రమాలతో ప్రజల్లో ఉన్న. ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థిగా ఇంటింటికీ వెళ్తున్న. ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తున్నది.
నేను నియోజకవర్గంలో లక్ష ఓట్లు సాధిస్తానన్న నమ్మకం కలిగింది’ అని జగిత్యాల బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కల్వకుంట్ల స్పష్టం చేశారు. శనివారం ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇటీవల కోరుట్ల వేదికగా పెన్షన్ రాకుండా మిగిలిపోయిన బీడీ కార్మికులందరికీ పెన్షన్ ఇస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించడం ఈ ప్రాంత ఆడబిడ్డలకు ఇచ్చిన కట్నంగా భావిస్తున్నానని చెప్పారు. ‘ఉద్యమ సమయంలో సంజయ్ నా ప్రాణాలు కాపాడాడని, నా బిడ్డలాంటోడు అని, దీవించాలని’ సీఎం విజ్ఞప్తి చేయడం తన జీవితంలో మరిచిపోలేనిదని గుర్తు చేశారు. ప్రతిపక్ష రాజకీయ పార్టీల తప్పుడు ప్రచారానికి మోసపోవద్దని, అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా పురోగమిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్కు మద్దతు ఇవ్వాలని కోరారు.
– జగిత్యాల, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ)
జగిత్యాల, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): ‘నేను ఎన్నో ఏండ్ల నుంచి ప్రజాక్షేత్రంలోనే ఉన్నా. సేవా కార్యక్రమాలతో చేరువయ్యా. ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థిగా తిరుగుతున్నా. సీఎం కేసీఆర్ దార్శనికత, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు నిజాయితీ వల్ల ప్రజల్లో స్పందన అపూర్వంగా ఉన్నది. బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపే కాదు, లక్ష ఓట్లు సాధిస్తానన్న విశ్వాసం ఏర్పడింది’ అని కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ధీమా వ్యక్తం చేస్తున్నారు. కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రచార పర్వంలో బిజీగా ఉన్న ఆయన, ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన
నమసే : బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్నారు కదా..? ప్రజల స్పందన ఎలా ఉన్నది?
కల్వకుంట్ల సంజయ్: నేను చాలా ఏండ్ల నుంచే ప్రజాక్షేత్రంలో ఉన్నా. కాకపోతే రాజకీయ నాయకుడిగా కాదు, ఒక వైద్యుడిగా, ఎమ్మెల్యే కొడుకుగా నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులోనే ఉన్నా. అయితే అభ్యర్థిగా ఆగస్టులో ప్రకటించినప్పటి నుంచి ప్రచారంలో ఉ న్నా. నేను ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నది. బీఆర్ఎస్ చేస్తు న్న అభివృద్ధి సంక్షేమ పథకాలు, సీఎం కేసీఆర్ మార్గదర్శనం, కోరుట్ల ఎమ్మెల్యేగా నాలుగుసార్లు పనిచేసిన కల్వకుంట్ల విద్యాసాగర్రావు గారి నిజా యితీ నాకు మంచి ఆదరణను తెచ్చిపెట్టిందనే చెప్పాలి.
నమస్తే : వైద్య వృత్తిలో ఉన్న మీరు ఇప్పుడు ప్రజాక్షేత్రంలో రావడం ఎలా అనిపిస్తున్నది?
కల్వకుంట్ల సంజయ్ : నేను వైద్య వృత్తిలో ఉన్నా నాకు ప్రజాక్షేత్రంలో పనిచేయడం కొత్తేమి కాదు. వైద్య వృత్తి సైతం ప్రజలతో మమేకమై చేసేదే కదా. అయితే అక్కడ పేషెంట్, పేషెంట్ బంధువులు మాత్రమే ఉంటారు. ఇక్కడ విస్తృత స్థాయి ప్రజా సమూహం ఉంటుంది. అయితే రోజుకు 16 గంటల పాటు ప్రజాక్షేత్రంలోనే ఉండడం, భిన్నవర్గాల ప్రజలతో కలువడం, వారి సమస్యలు తెలుసుకోవడం మాత్రం పరీక్షలు రాస్తున్న అనుభవాన్ని ఇస్తున్నాయి. డాక్టర్ కోర్సు చదివేటప్పుడు పరీక్షలకు రోజుకు పది, పన్నెండు గంటలు సన్నద్ధమైన అనుభవం ఉంది. అయితే ప్రజాక్షేత్రంలో సన్నద్ధం కావడం మాత్రం కొంత భిన్నమైన అనుభవమే.
కల్వకుంట్ల సంజయ్ : నేను నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉన్నా. కోరుట్లలో కచ్చితంగా గెలుస్తానన్న నమ్మకం కలుగడం కాదు, లక్ష ఓట్లు సాధిస్తానన్న విశ్వాసం ఉంది. అరవై ఏండ్లలో జరగని అభివృద్ధి కోరుట్ల నియోజకవర్గంలో తొమ్మిదిన్నరేండ్లలో జరిగింది. అలాగే సంక్షేమ ఫలాలు ఈ దశాబ్దకాలంలో అందినట్లుగా ప్రజలకు ఎప్పుడూ అందలేదు. దాదాపు 85వేల మందికి పెన్షన్లు, వేలాది మందికి సీఎంఎఫ్ఆర్ సాయం, రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, నీటిపారుదల సౌకర్యం, మిషన్ కాకతీయ, పరిపాలన వికేంద్రీకరణ అన్ని జరిగాయి. వాటి ఫలాలు అందుకున్న ప్రజల నుంచి మంచి ఆదరణ కనిపిస్తున్నది. కోరుట్లలోనే కాదు, రాష్ట్రంలోనూ బీఆర్ఎస్ 85 శాతం సీట్లను, 75 శాతం ఓట్లను కైవసం చేసుకుంటుంది. జయం మనదే అన్న విశ్వాసం గుండెల నిండా ఉంది.
కల్వకుంట్ల సంజయ్ : ప్రచారం చేస్తున్న టైంలో కొన్ని సమస్యలు ప్రజలు చెప్పారు. కొన్నింటిని నేను గుర్తించాను. ముఖ్యంగా కోరుట్ల, మెట్పల్లి వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ పట్టణాల్లో రోజురోజుకూ జనాభా పెరుగుతున్నది. చుట్టుపక్కల ప్రాంతాలైన కథలాపూర్, మేడిపల్లి, నిజామాబాద్ జిల్లాలోని చివరి గ్రామాల వారు సైతం ఈ పట్టణాలకు వలస వస్తున్నారు. వారంతా సౌకర్యాలు కావాలని కోరుకుంటు న్నారు. పట్టణాధికారులు ఎంత వేగంగా పనులు చేసినా రోజురోజుకూ కొత్త సమస్యలు వస్తూనే ఉన్నాయి.
రోడ్లు కావాలని, మురుగు కాలువలు కావాలని, వీధి దీపాలు కావాలని కోరుతున్నారు. ఇలాంటి సమస్యలన్నీ పరిష్కరిస్తా. అలాగే యువతకు ఉన్నత చదువుల కోసం పీజీ కాలేజీలు, సాంకేతిక కాలేజీలను స్థాపించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నా. అలాగే ఉపాధి అవకాశాల కల్పన కోసం కొన్ని పరిశ్రమలను స్థాపించాలి. ఇండ్లు లేని నిరుపేదల సంఖ్య కొంత ఎక్కువగానే ఉంది. వారికి డబుల్ బెడ్ రూమ్ ఇం డ్ల నిర్మాణంతో పాటు, గృహలక్ష్మి పథకాన్ని వర్తిం పజేస్తా. కోరుట్లలో కొన్ని ప్రభుత్వ కార్యాల యాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రభుత్వం ఏర్పడగానే వీటిని సాధించేందుకు కృషి చేస్తా.
సంజయ్ కల్వకుంట్ల : దళితబంధు, బీసీ కులవృత్తులకు ఆర్థిక సాయం పథకాలను ప్రజలు చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ప్రతిపక్ష పార్టీలు సైతం ప్రజలను మభ్యపెట్టేం దుకు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. దళిత బం ధు, బీసీ ఆర్థిక సాయం పథకాలు కుటుం బాలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు ఉద్దేశిం చినవి. ఈ పథకాల కింద సాయం పొందిన వా రు, వ్యాపారవేత్తలుగా, వృత్తి నైపుణ్యదారులు గా మారి, వాటి సాయంతో ఆర్థిక స్వావలంభన సాధించి, భవిష్యత్తులో మరింత ఆర్థిక వృద్దికి దోహదపడాలన్నదే ఈ పథకాల ఉద్దేశం. అయితే ఈ పథకాలను ఉచిత పథకాలుగా ప్రతిపక్షాలు ప్రచారం చేయడం సరికాదు.
దళితబంధు పథకంలో లబ్ధి పొందిన మల్లాపూర్ మండల యువకుడు రెండు రోజుల క్రితం కలిశాడు. సార్ ట్రాక్టర్ కొన్నా.. ఈ యేడాదిలో మంచి లాభాలు వచ్చాయని చెప్పిండు. నాకు చాలా సంతోషం వేసింది. వచ్చే ఏడాది వరకు మరో ట్రాక్టర్ కొనాలని చె ప్పా. దళితబంధు పథకానికి రానున్న రోజుల్లో మ రింతగా నిధులు పెరుగుతాయి. సాగునీటి ప్రాజెక్టులు సంపూర్ణ దశకు వచ్చాయి. ఈ రంగాలకు కేటాయింపులు తగ్గుతాయి. తర్వాత దళితబంధు లాంటి ఎంపవర్మెంట్ పథకాలకే ప్రాధాన్యం ఇస్తారు.
నమస్తే : సీఎం కేసీఆర్ కోరుట్లలో బహిరంగ సభలో పాల్గొన్నారు కదా..? ఆ సభ మీ గెలుపునకు ఎంత వరకు
కల్వకుంట్ల సంజయ్ : సీఎం కేసీఆర్ సభ కోరుట్లలో అద్భుత విజయవంతమైంది. లక్ష మంది ప్రజలు సీఎం కేసీఆర్ను చూసేందుకు, ఆయన మాట వినేందుకు ఉత్సాహంగా తరలివ చ్చారు. సీఎం కేసీఆర్ సభలో ప్రసంగిస్తూ రాజ కీయ పరిస్థితులను, ప్రస్తుత సందర్భాన్ని ప్రజలకు వివరించారు. ఆయన మాట్లాడిన ప్రతి మాట విశేషంగా ఆకట్టుకున్నది. ప్రజల్లో మంచి స్పందన కనిపించింది. ముఖ్యంగా సీఎం కేసీఆర్ కోరుట్ల వేదికగా పెన్షన్ రాకుండా మిగిలిపోయిన బీడీ కార్మికులందరికీ పెన్షన్ ఇస్తానని ప్రకటించడం కోరుట్ల ఆడబిడ్డలకు ఇచ్చిన కట్నంగా భావిస్తున్నా. అలాగే కోరుట్ల పట్టణంలో చేనేత కార్మిక కుటుంబాలు అధిక సంఖ్యలో ఉన్నారు. అయితే చేనేత కార్మికుల కోసం రాష్ట్ర బడ్జెట్లో ఎక్కువ నిధులు ఇస్తామని ప్రకటించడం సైతం సంతోషం కలిగించింది. సీఎం కేసీఆర్ సభ నా గెలుపును తథ్యం చేసింది.
సంజయ్ కల్వకుంట్ల : ప్రతిపక్ష పార్టీలకు బేసిక్గానే విమర్శించేందుకు అర్హత లేదు. అవ కాశం లేదు. కాంగ్రెస్, బీజేపీలు చేసేవన్నీ అబద్ధపు, అసంబద్ధపు ఆరోపణలే. ప్రజలు వాటి ని పట్టించుకోవడమే మానేశారు. కోరుట్లలో పోటీ లో ఉన్న అభ్యర్థులు, నాపై విమర్శలు చేసేందుకు ఏం లేక తప్పుడు ఆరోపణలకు దిగారు. కమీషన్ల డాక్టర్ను అంటున్నారు. ఇది పూర్తిగా శుద్ధతప్పు. దాదాపు పదిహేనేండ్లుగా వైద్యుడిగా సేవ చేస్తున్నాను. హైదరాబాద్ స్థాయిలో కోరుట్ల వారికి వైద్యసేవలు తక్కువ ఖర్చుతో అందించా. ఈ ప్రాంత ప్రజలు ఏ రాత్రి ఫోన్ చేసినా స్పందిం చా.
కరోనా కాలంలో ఇక్కడే ఉండి ఇంటింటికి వెళ్లి ప్రజలకు దైర్యం చెప్పా. వేలమంది పిల్లలకు సొంత డబ్బులతో వ్యాక్సినేషన్ చేయించా. ఆక్సీజన్ కిట్లు అందించా. అలాంటి నాపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు. ఇప్పుడు నాపై మాట్లాడు తున్న ప్రత్యర్థులు కరో నా కాలంలో ఒక్కరోజు కాదు కదా, ఒక గంట సేపు ఇక్కడికి రాలేదు. ప్రజలకు ధైర్యం చెప్ప లేదు. నేను ఎలాంటి వాడి నో కోరుట్ల నియోజక వర్గంలో ఉన్న రెండులక్షల ముప్పై వేల మందికి తెలుసు. వారి తప్పుడు ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు.
నమస్తే : సీఎం కేసీఆర్ కోరుట్ల సభలో డాక్టర్ సంజయ్ నా బిడ్డలాంటివాడు. ఆమరణ దీక్ష సమయంలో నన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు అన్నారు. దీనిపై మీ స్పందన ఏంటీ?
సంజయ్ కల్వకుంట్ల : సీఎం కేసీఆర్ లాంటి దార్శనికుడు, రాజనీతిజ్ఞుడు లక్షమంది ఉన్న సభలో డాక్టర్ సంజయ్ నా బిడ్డలాంటి వాడు, పుట్టిన గడ్డకు సేవ చేయడానికి కోట్లు సంపాదించే డాక్టర్ వృత్తిని వదిలిపెట్టి వచ్చాడనడం, అలాగే 2009లో ఆమరణ దీక్ష సమయంలో డాక్టర్గా నా పక్కనే ఉండి. నిమిషనిమిషం కాపాడాడు అ ని పేర్కొనడం నాకు అమిత ఆనందాన్ని కలిగిం చాయి. అంతటి గొప్ప వ్యక్తి నోటి వెంట నాపేరు రావడం నా జన్మకు సార్థకత కలిగించింది. ఆ క్షణం నా జీవితంలో మరిచిపోలేని అనుభూతిని ఇచ్చింది. సీఎం కేసీఆర్ ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు సాగుతా.
సంజయ్ కల్వకుంట్ల : ప్రజలకు నేనే చేసే అప్పీ ల్ ఒక్కటే. నేను ఈ గడ్డపై పుట్టిన బిడ్డను. మిగిలిన ప్రత్యర్థులు. వేరే ప్రాంతం నుంచి వచ్చిన బి డ్డలు. ఈ ప్రాంతంపై నాకు ఎక్కువ ప్రేమ ఉం టుందో, ఇతరప్రాంత బిడ్డలకు ప్రేమ ఉంటుందో ఆలోచించండి. అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా పురోగమిస్తున్న బీఆర్ఎస్కు. సీఎం కేసీఆర్కు మద్దతును ఇవ్వండి. ప్రతిపక్ష రాజకీయ పార్టీల తప్పుడు ప్రచారానికి మోసపోకండి. ఈ ప్రాంత బిడ్డను ఆశీర్వదించండి. అన్నదే నా విన్నపం. నా అప్పీల్.