ముస్తాబాద్, అక్టోబర్ 26: రానున్న ఎన్నికల్లో పార్టీ నిలిపిన అభ్యర్థుల గెలుపు సులభమని, మెజార్టీయే లక్ష్యంగా పని చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు పిలుపునిచ్చారు. తొమ్మిదేండ్లల్లో సీఎం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే పార్టీ అభ్యర్థులకు శ్రీరామ రక్ష అని, అవే బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయానికి దోహదపడుతాయని ధీమా వ్యక్తం చేశారు. శాసన సభ ఎన్నికలను పురస్కరించుకొని పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన కార్యక్రమాలపై మండల కేంద్రంలోని ఏఎంఆర్ గార్డెన్లో గురువారం పార్టీ మండలాధ్యక్షుడు బొంపెల్లి సురేందర్రావు అధ్యక్షతన కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు.
రవీందర్రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సామాన్యుడి కోసం నిరంతరం పనిచేస్తున్న కేసీఆర్ మూడోసారి సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో అభ్యర్థుల ప్రచారంలో పాల్గొంటున్నారని, దీంతో నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు చిన్న చిన్న విభేదాలు పక్కనపెట్టి సమష్ఠిగా పని చేయాలని పిలుపునిచ్చారు.
పార్టీ అమలు చేసిన సంక్షేమ పథకాలు, గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని, ప్రజలకు అందిన ఫలాలను, మ్యానిఫెస్టోను గడపగడపకు కూలంకషంగా వివరించాలన్నా రు. ప్రతిపక్షాలు కుట్రలు, కుతంత్రాలు, పన్నాగాలతో ప్రజల ను మభ్యపెట్టేలా చూస్తున్నాయని, వాటిని తిప్పికొట్టేలా పని చేయాలని సూచించారు.
కాంగ్రెస్కు ఓటు వేస్తే కరెంట్ తిప్ప లు తప్పవన్నారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య మాట్లాడారు. గతంలో కంటే మంత్రి కేటీఆర్కు ఈ సారి అధిక మెజార్టీయే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలన్నారు. సిరిసిల్ల గడ్డ బీఆర్ఎస్ అడ్డా అని మరోసారి నిరూపించాలని సూచించారు. అంతకు ముందు పార్టీ అమలు చేసిన సంక్షేమ పథకాలు, మ్యానిఫెస్టో వివరాల తో కూడిన ప్రచార వాహనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ జనగామ శరత్రావు, రైతుబంధు మండలాధ్యక్షుడు కల్వకుంట్ల గోపాల్రావు, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ అక్కరాజు శ్రీనివాస్, సర్పంచ్ గాండ్ల సుమతి, పోతుగల్ సహకార సంఘం మండలాధ్యక్షుడు తన్నీరు బాపురావు, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు కలకొండ కిషన్రావు, మాజీ ప్రజాప్రతినిధులు మేర్గు యాదగిరిగౌడ్, ఏనుగు విజయరామారావు, చిట్నేన్ని అంజన్రావు, బత్తుల అంజయ్య, సర్వర్పాషా, మల్లేశ్యాదవ్, కొమ్ము బాలయ్య, శీలం జానాబాయి, పట్టణ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.