గంభీరావుపేట/సిరిసిల్ల రూరల్/ ముస్తా బాద్, ఫిబ్రవరి 11: కృష్ణా నది జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో నిర్వహించే చలో నల్లగొండ భారీ బహిరంగ సభకు అధిక సంఖ్యలో తరలివెళ్లి విజయవంతం చేద్దామని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన బీఆర్ఎస్ నాయకులతో సమావేశమై, సభ విజయవంతంపై దిశానిర్దేశం చేశారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ సారథ్యంలో ఈ నెల 13న నిర్వహించే చలో నల్లగొండ సభను విజయవంతం చేయాలని కోరారు.
అంతకు ముందు నేషనల్ కో ఆపరేటివ్ డెవలప్మెంట్ కౌన్సిల్, బ్యాం కర్స్ ఇన్స్టిట్యూట్ ఆప్ రూరల్ డెవలప్మెంట్ గవర్నింగ్ సభ్యుడిగా ఎన్నికైన నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావును మండల నాయకులు సన్మానించారు. ఇక్కడ బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాపాగారి వెంకటస్వామిగౌడ్, సింగిల్విండో జిల్లా సభ్యులు భూపతి సురేందర్, నాయకులు దయాకర్రావు, గంద్యాడపు రాజు, రాజేందర్, గోగు లింగంయాదవ్, వహీద్, శేఖర్గౌడ్, అనిల్, గౌసొద్దీన్, ఎగదండి స్వామి, రమేశ్, నర్సింగరావు, పాపారావు, రాజు ఉన్నారు.
తంగళ్లపల్లి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో మం డలాధ్యక్షుడు గజభీంకార్ రాజన్న ఆదివారం సమావేశమయ్యారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సారథ్యంలో ఈ నెల 13న నల్లగొండలో నిర్వహించే బహిరంగ సభకు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్లు బం డి దేవదాస్గౌడ్, కోడూరి భాస్కర్గౌడ్, నాయకులు సింగిరెడ్డి రవీందర్రెడ్డి, పడిగెల రాజు, కోడి అంతయ్య, మాట్ల మధు, వలకొండ వేణుగోపాల్రావు, ఈసరి ఉమరాజు, మీరాల భాస్కర్ యాదవ్, ఏసీరెడ్డి రాంరెడ్డి, ములిగే దుర్గాప్రసాద్, బండి దేవేందర్, సింగిరెడ్డి ముత్యంరెడ్డి, ఆత్మకూరి చంటి, బల్లెపు సిద్ధన్న, నక్క కొమురయ్య, సురభి నవీన్రావు, మోతె మహేశ్, గుగ్గిళ్ల ఆంజనేయులు, బాల్రెడ్డి, పరశురాములు పాల్గొన్నారు.
ముస్తాబాద్ మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో ఎంపీపీ జనగామ శరత్రావు, పార్టీ మండలాధ్యక్షుడు బొంపెల్లి సురేందర్రావు, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి సమావేశమయ్యారు. నల్లగొండలో ఈ నెల 13న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సారథ్యంలో నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలను తరలించాలని సూచించారు.