కొత్తపల్లి, ఫిబ్రవరి 11: వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని, కేసీఆర్ దేశ ప్రధాని కావాలని కాంక్షిస్తూ కరీంనగర్కు చెందిన ముస్లిం మైనార్టీ నాయకులు శనివారం ఢిల్లీలోని అజ్మీర్ షరీఫ్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బీఆర్ఎస్కు చెందిన మైనార్టీ నాయకుడు షేక్ యూసుఫ్ ఆధ్వర్యంలో ప్రార్థనలు చేసి, చాదర్ సమర్పించారు. వినోద్కుమార్ ఎంపీగా పనిచేసిన టైంలోనే కరీంనగర్ నియోజకవర్గం అభివృద్ధి చెందిందని, ఆయన మరోసారి గెలుపొందాలని కోరుకున్నారు.
కరీంనగర్ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం నమోదు చేసి మంత్రిగా జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న గంగుల కమలాకర్ నాలుగోసారి విజయం సాధించాలని కోరుతూ దర్గాలో చాదర్ సమర్పించారు. ఇక్కడ బీఆర్ఎస్వీ కరీంనగర్ అధ్యక్షుడు ఫహాద్, మేరాజ్, మున్నా షాహా, సుఫియాన్, సయ్యద్ మాజీద్, తబ్రేజ్, జునాయిద్, అఫ్రోజ్, అనీఫ్, జమీల్, ఇఫ్తేకార్, సలీంలతో పాటు అధిక సంఖ్యలో మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.