వీణవంక, నవంబర్ 25: టీఆర్ఎస్తోనే సమగ్రాభివృద్ధి సాధ్యమని, కార్యకర్తలే పార్టీకి మూలస్తంభాలని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఎమ్మెల్సీ నివాస ఆవరణలో శుక్రవారం మండలంలోని 13 గ్రామాల టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలతో ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రతి గ్రామ ముఖ్య కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి ఆయా గ్రామాల్లో పార్టీ స్థితిగతులపై మాట్లాడి, సలహాలు, సూచనలు అందజేశారు.
అనంతరం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన గట్టు సుమలతకు రూ.20 వేలు, ఎలుబాక గ్రామానికి చెందిన మాడ మల్లారెడ్డికి రూ.55,000, ఊట్ల ప్రణీత్కు రూ.25,000, ఎ.గట్టమ్మకు రూ.60 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎలుబాక టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడిగా మడికొండ భూమయ్య, రైతు బంధు సమితి కోఆర్డినేటర్గా కర్కె సలేందర్ను నియమించారు. ఇప్పలపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు మెతుకు కోమల్రెడ్డి టీఆర్ఎస్లో చేరగాగా ఎమ్మెల్సీ గులాబీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, జడ్పీటీసీ మాడ వనమాల-సాదవరెడ్డి, సింగిల్విండో చైర్మన్ విజయభాస్కర్రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.