జమ్మికుంట, డిసెంబర్ 23: ముఖ్యమంతి కేసీఆర్ సర్వ మతాలకు సముచిత గౌరవం ఇస్తున్నారని, తెలంగాణ సెక్యులర్ రాష్ట్రమని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని సువర్ణ ఫంక్షన్ హాల్లో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక మండలాల్లోని క్రైస్తవులకు అందించిన క్రిస్మస్ కానుకలను ఆయన జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి మాట్లాడారు. స్వరాష్ట్రంలో అన్ని మతాలకు సీఎం కేసీఆర్ ప్రాధాన్యమిస్తున్నారని, అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందిస్తున్నారని తెలిపారు.
సర్వ మతాలకు ప్రతీకగా రాష్ట్రం నిలుస్తున్నదని స్పష్టం చేశారు. క్రిస్మస్ కానుకలు ఇచ్చి, భోజనం పెట్టి ఆదరిస్తున్న ప్రభుత్వం బీఆర్ఎస్ ఒక్కటేనని జడ్పీ చైర్పర్సన్ విజయ కొనియాడారు. అంతకుముందు మినీ క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఎమ్మెల్సీ కేక్ కట్ చేశారు. క్రైస్తవ గురువులు ఎమ్మెల్సీని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ ఆర్డీవో హరిసింగ్, జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక తహసీల్దార్లు రాజేశ్వరి, మాధవి, రాజయ్య, జడ్పీటీసీ డాక్టర్ శ్యాం, పీఏసీఎస్ చైర్మన్ సంపత్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దేశిని స్వప్న-కోటి, ఎంపీపీలు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, క్రైస్తవులు, మతగురువులు, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.