వీణవంక, డిసెంబర్ 23 : దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీతోనే మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి సాధ్యమైందని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి అన్నారు. వీణవంక సొసైటీ ఆధ్వర్యంలో రెడ్డిపల్లి చెరువులో 30 వేలు, చల్లూరు సొసైటీ ఆధ్వర్యంలోని ఇప్పలపల్లి చెరువులో 52 వేల ఉచిత చేపపిల్లలను శుక్రవారం స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్సీ వదిలారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో చెరువులు బాగాలేక, అందులో నీరు లేక, చేపల పెంపకం లేక మత్స్యకారులు నిరుపేదలుగా మారారన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక కులవృత్తుల పునరుద్ధరణకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టి మత్స్యకారుల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి అండగా నిలిచారన్నారు.
అనంతరం చల్లూరు మహిళా సంఘ సభ్యులను కలిసి వారితో ముచ్చటించారు. వీణవంక మేదర సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వార్షిక ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశా రు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, వైస్ ఎంపీపీ రాయిశెట్టి లత-శ్రీనివాస్, సర్పంచుల ఫోరం అ ధ్యక్షుడు రఘుపాల్రెడ్డి, మాజీ సింగిల్విం డో చైర్మన్ గంగాడి తిరుపతిరెడ్డి, సర్పంచు లు నీల కుమారస్వామి, పోతుల నర్సయ్య, పొదిల జ్యోతి-రమేశ్, ఎంపీటీసీలు ఒడ్డెపెల్లి లక్ష్మి-భూమయ్య, ఎలవేని సవిత-మల్లయ్య, డీఎఫ్వో విజయ్కిరణ్కర్, అసిస్టెం ట్ ఇన్స్పెక్టర్ మంజుల, పీఏసీఎస్ డైరెక్టర్ శ్యాంసుందర్రెడ్డి, చల్లూరు మత్స్యకార్మిక సంఘం అధ్యక్షుడు ఈర్ల రవి, వీణవంక, చల్లూరు సొసైటీ డైరెక్టర్లు మోటం సంపత్, కుమారస్వామి, మోటం రాజు, రాయిశెట్టి ఓనయ్య, మోటం సారయ్య, పవన్ కళ్యా ణ్, రమేశ్, సదయ్య, సతీశ్, సమ్మయ్య, మహేశ్, నాయకులు అడిగొప్పుల సత్యనారాయణ, మధురెడ్డి, కోమాల్రెడ్డి, తిరుపతి, శ్రీనివాస్, భానుచందర్ పాల్గొన్నారు.
రైతుల సౌకర్యార్థం నీటి విడుదల
యాసంగి సాగుకు నీరు కావాలని నియోజకవర్గ రైతులు కోరగా.. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి శనివారం ఎస్సారెస్పీ నుంచి నీటిని విడుదల చేస్తామని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి తెలిపారు. యాసంగి నాట్లకు రైతులు సిద్ధం కాగా.. సాగునీరు సరిపడా లేకపోవడంతో ఇటీవల హుజూరాబాద్ నియోజకవర్గ రైతులు ఎమ్మెల్సీని కలిసి ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయించాలని కోరారు. దీనికి స్పందించిన ఆయన విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించి నీటి విడుదలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ యన మాట్లాడారు. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతిగా వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు.
24 గంటల కరెంట్, సరిపడా సాగునీరు, రైతు బంధు తో అండగా ఉంటున్నారని చెప్పారు. రాష్ట్రం లో బీఆర్ఎస్ పార్టీ రైతులకు అన్ని రకాల సంక్షేమ పథకా లు అందజేస్తూ భరోసా కల్పిస్తున్నదని తెలిపారు. నీటి విడుదలకు కృషి చేసిన సీఎం కే సీఆర్కు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి, నియోజకవర్గ రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, వైస్ ఎంపీపీ రాయిశెట్టి లత-శ్రీనివాస్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఎక్కటి రఘుపాల్రెడ్డి, మాజీ సింగిల్విండో చైర్మన్ గంగాడి తిరుపతిరెడ్డి, వీణవంక స ర్పంచ్ నీల కుమారస్వామి, ఉపసర్పంచ్ భానుచందర్, నాయకులు భిక్షపతి, రవి, సంపత్, మహేశ్, చైతన్య పాల్గొన్నారు.