పెద్దపల్లి/ మంథని/రామగిరి, నవంబర్18: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం పెద్దపల్లి, మంథనిలో పర్యటించనున్నారు. మంథని నియోజకవర్గంలోని మధ్యాహ్నం ఒంటి గంటకు కాటారంలోని గారెపల్లి ప్రతిపాదిత మినీ స్టేడియంలో, సాయంత్రం 4 గంటలకు రామగిరి మండలం సెంటినరికాలనీలోని వాణి సూల్ గ్రౌండ్లో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. ఇందుకు మంథని బీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధూకర్, భూపాలపల్లి జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి, మంథని బల్దియా చైర్పర్సన్ పుట్ట శైలజ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు అన్ని ఏర్పాట్లు చేశారు.
నియోజకవర్గానికి వస్తున్న ఎమ్మెల్సీ కవితకు భారీ స్వాగతం పలకడంతో పాటు బైక్ ర్యాలీ కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గంలోని మంథని, ముత్తారం, రామగిరి, కమాన్పూర్, మహాముత్తారం, మహదేవపూర్, పల్మెల, మల్హర్, కాటారం మండలాల్లోని ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు కోరుతున్నారు. మంథనిలో పర్యటన అనంతరం సాయంత్రం 5:30 గంటలకు పెద్దపల్లికి చేరుకుంటారు. ఇక్కడ రోడ్షో నిర్వహించి జెండా కూడలి వద్ద ప్రజలనుద్దేశించి ప్రసగించనున్నారని పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్రెడ్డి వెల్లడించారు. పట్టణంతో పాటు నియోజక వర్గంలోని ప్రజలు పెద్దసంఖ్యలో తరలిరావాలని కోరారు. మండలంలోని సెంటినరీ కాలనీ వాణి సెకండరి పాఠశాల గ్రౌండ్ను శనివారం గోదావరిఖని ఏసీపీ తుల శ్రీనివాస రావు పరిశీలించారు.