చందుర్తి, మే 5: ‘కాంగ్రెసోళ్లు వచ్చి మార్పు.. మార్పు అని చెబితే ప్రజలు ఆశపడి ఓట్లేసిండ్రు. ఇప్పుడేమైంది..? కరెంటు కష్టాలు వచ్చినయి. మంచినీళ్ల కష్టాలు వచ్చినయి. కాంగ్రెస్ తెచ్చిన మార్పు ఇదేనా. ఉన్నయి బంద్ పెట్టి ప్రజలను సంతోషం నుచి కష్టాల్లోకి నెట్టడమేనా..? అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మెడలు వంచి అడగాలంటే ప్రజలు ఈ నెల 13న బీఆర్ఎస్కు ఓటేసి, వినోదన్నను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
చందుర్తి మండల కేంద్రంలో ఆదివారం బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహరావు అధ్యక్షతన జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్యఅతిథిగా బీఆర్ఎస్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బీ వినోద్కుమార్తో కలిసి హాజరయ్యారు.
ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఆరుగ్యారంటీలు, పదమూడు హామీలు వంద రోజుల్లో అమలు చేస్తామని రాసిచ్చిన బాండ్ పేపర్లు బౌన్స్ అయ్యాయన్నారు. తిరగబడుతున్న జనాన్ని చూసి, ఎవరు ఓట్లేసేటట్టు లేరని భయంతో రేవంత్రెడ్డి దేవుళ్ల మీద ఒట్టుపెడుతున్నాడని ధ్వజమెత్తారు.
రేవంత్రెడ్డి వేములవాడ రానందునే మా రాజన్న బతికిపోయాడన్నారు. కార్యక్రమంలో ఇకడ ఎన్నికల ఇన్చార్జి గూడూరి ప్రవీణ్, జడ్పీచైర్ పర్సన్ న్యాలకొండ అరుణ, మాజీ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, ఎంపీపీలు బైరగోని లావణ్య, గంగం స్వరూప, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బీఎన్ రావు, ఏనుగు మనోహర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ఎల్లయ్య, సెస్ డైరెక్టర్లు తిరుపతి,శ్రీనివాసరావు, ఫ్యాక్స్ చైర్మన్లు కిషన్ రావు, శ్రీనివాస్ మాజీ ఎంపీపీ పెంటయ్య, అనిల్ రావు, యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు రాజు, కమలాకర్ ఆనందం రవి ఉన్నారు.