గంగాధర, మార్చి 18: క్రీడలతో శారీరక ఆరోగ్యంతో పాటు మానసికోల్లాసం కలుగుతుందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. గంగాధర వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ను శనివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. టోర్నమెంట్లో పాల్గొంటున్న క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందన్నారు. టోర్నమెంట్లో పాల్గొనడానికి వచ్చే క్రీడాకారులకు ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులకు సూచించారు.
గంగాధర ఎస్ఎల్ మార్ట్ నిర్వాహకుడు మహేశ్ అందజేసిన అఫిషీయల్ టీషర్టులను, గంగాధర గ్రామానికి చెందిన సబ్ ఇన్స్పెక్టర్ పులిచెర్ల ఉదయ్ అందజేసిన క్రీడా టీషర్టులను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. క్రీడాకారులకు భోజన వసతి ఏర్పాటు చేసిన సర్పంచ్ మడ్లపెల్లి గంగాధర్ను ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం విజేత జట్టుకు అందజేసే ట్రోఫీలను ఆవిష్కరించారు. సర్పంచులు వేముల దామోదర్, ఎండీ నజీర్, ఏఎంసీ వైస్ చైర్మన్ సామంతుల శ్రీనివాస్, నాయకులు రేండ్ల శ్రీనివాస్, తడిగొప్పుల రమేశ్, తాళ్ల సురేశ్, క్రీడాకారులు ఠాగూర్, శశికిరణ్, వెంకటేశ్, హరీశ్, సంతోష్ పాల్గొన్నారు.