చొప్పదండి (రామడుగు) నవంబర్22 : ‘నా ఊపిరి ఉన్నంత కాలం ప్రజల వెంటే ఉంటా’ అని చొప్పదండి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. బుధవారం రామడుగు మండలంలోని గోపాల్రావుపేటలో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మహిళలు మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. అనంతరం గోపాల్రావుపేట బస్టాండ్ కూడలిలో ఏర్పాటు చేసిన ప్రచార సభలో ఆయన మాట్లాడారు. తాను స్థానిక బిడ్డనని, అందుబాటులో ఉండి నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నానని, ఆశీర్వదించాలని కోరారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను చూసి మోసపోవద్దని సూచించారు. 60 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ ఏమీ చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇక్కడిలాంటి పథకాలు ఎందుకు లేవని ప్రశ్నించారు.
గోపాల్రావుపేట ప్రజల చిరకాల వాంఛ అయిన మండల కేంద్రం ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. ప్రచారంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీపీ మారొండ కిష్టారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్రెడ్డి, కలిగేటి లక్ష్మణ్, నాగిశేఖర్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు ఎడవల్లి నరేందర్రెడ్డి, మాజీ మారెట్ కమిటీ చైర్మన్ కోడూరి మణెమ్మ – మల్లేశం, కొండగట్టు డైరెక్టర్ దాసరి రాజేందర్రెడ్డి, ఎడవల్లి పాపిరెడ్డి, గ్రామ అధ్యక్షుడు వేల్పుల హరికృష్ణ, మారెట్ కమిటీ డైరెక్టర్లు కొలిపాక మల్లేశం మచ్చ గంగయ్య, మాజీ ఎంపీటీసీ దాసరి లక్ష్మి అరుణ్ కుమార్, మాజీ సర్పంచ్ నేరెళ్ల అంజయ్యగౌడ్, నాయకులు రేణికుంట బసంతం, పైండ్ల శ్రీనివాస్, రేణికుంట అశోక్, రాజిరెడ్డి, శ్యాంసుందర్రెడ్డి, సుద్దాల మల్లేశం, పురాణం రమేశ్, కొలిపాక మల్లయ్య, తిరుపతి, రఘు, దాసరి అనిల్, అల్వాల విష్ణు, అల్వాల శంకర్ పాల్గొన్నారు.