చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ను మరోసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మొదటిసారిగా శనివారం చొప్పదండి పట్టణానికి రాగా, పార్టీ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్రెడ్డి, పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. డీజే చప్పుళ్లు, డప్పు వాయిద్యాల మధ్య పటాకులు కాలుస్తూ సంబురాలు నిర్వహించారు. మహిళలు మంగళహారతులు పట్టి, వీరతిలకం దిద్దారు. వరలక్ష్మి ఫంక్షన్ హాల్ నుంచి రెండు వేల మంది వెయ్యి బైకులతో అంబేదర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ తీశారు. తెలంగాణ చౌరస్తాలో నాయకులు క్రేన్ సహాయంతో ఎమ్మెల్యేకు గజమాల వేసి, శాలువాతో సన్మానించారు. అనంతరం అంబేదర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేశారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలుస్తుందని, ప్రతిపక్షాల డిపాజిట్లు గల్లంతవుతాయని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
-చొప్పదండి, ఆగస్టు 26
చొప్పదండి, ఆగస్టు 26 : రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలుస్తుందని, ప్రతిపక్షాల డిపాజిట్లు గల్లంతవుతాయని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. ఆ మేరకు ఆయనను బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మొదటిసారిగా శనివారం చొప్పదండి పట్టణానికి రాగా, పార్టీ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్రెడ్డి, పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. డీజే చప్పుళ్లు, డప్పు వాయిద్యాల మధ్య పటాకులు కాలుస్తూ సంబురాలు నిర్వహించారు. మహిళలు మంగళహారతులు పట్టి, వీరతిలకం దిద్దారు. వరలక్ష్మి ఫంక్షన్ హాల్ నుంచి రెండు వేల మంది వెయ్యి బైకులతో అంబేదర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ తీశారు. తెలంగాణ చౌరస్తాలో నాయకులు క్రేన్ సహాయంతో ఎమ్మెల్యేకు గజమాల వేసి, శాలువాతో సన్మానించారు. అనంతరం అంబేదర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ తనను రెండోసారి అభ్యర్థిగా ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు. 2018 ఎన్నికల్లో 42 వేల మెజార్టీతో గెలిపించినందుకు కృతజ్ఞతలు చెప్పారు.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్సీ సంతోష్కుమార్ నాయకత్వంలో 120 కోట్లతో చొప్పదండి నియోజకవర్గ కేంద్రాన్ని అభివృద్ధి చేసి చూపినట్లు తెలిపారు. 1600 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేశామని చెప్పారు. నాడు నియోజకవర్గంలో సాగుకు నీళ్లు లేక ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, ఇప్పుడు కాళేశ్వరం జలాలతో నియోజకవర్గంలోని చెరువులు నిండి మరో కోనసీమగా మారిందని తెలిపారు. అణగారిన వర్గాల అభివృద్ధే ధ్యేయంగా సీఎం పనిచేస్తున్నారని కొనియాడారు. 24 గంటల కరెంటు, రైతు బంధు , రైతు బీమా, దివ్యాంగులకు 4016 పింఛన్ లాంటి పథకాలు ఎకడా లేవని విమర్శించారు. అకడ చేతగాని నాయకులు ఇకడ ఏం చేస్తారో ప్రజలు ఆలోచించాలని కోరారు. అందరం కలిసి కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిగా చేయాలని పిలుపునిచ్చారు. తాను గెలిస్తే మరో సిరిసిల్ల, సిద్దిపేటలా మారుస్తానని హామీ ఇచ్చారు.
‘కార్యకర్తలే నా బలం.. మీరే నా కుటుంబం.. మీ కోసమే నేను పని చేస్తా” అని స్పష్టం చేశారు. గులాబీ జెండా ఇంత గొప్పగా ఎగరడం కార్యకర్తలతోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే మళ్లీ గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిలుక రవీందర్, సింగిల్ విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డి, మారెట్ కమిటీ చైర్మన్ గడ్డం చుకారెడ్డి, వైస్ చైర్మన్ చీకట్ల రాజశేఖర్, ఆర్బీఎస్ మండల కన్వీనర్ గుడిపాటి వెంకటరమణారెడ్డి, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ గన్ను శ్రీనివాస్రెడ్డి, మాజీ జడ్పీటీసీ ఇప్పనపల్లి సాంబయ్య, మాజీ ఎంపీపీ వల్లాల కృష్ణహరి, మాజీ మారెట్ కమిటీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్గౌడ్, మాజీ వైస్ చైర్మన్ కొత్త గంగారెడ్డి, బీఆర్ఎస్ యువజన విభాగం ఇన్చార్జి బందారపు అజయ్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఇప్పనపల్లి విజయలక్ష్మి, కౌన్సిలర్లు కొత్తూరు మహేశ్, మాడూరి శ్రీనివాస్, సర్పంచులు గుంటరవి, వెల్మ నాగిరెడ్డి, సురేశ్, దామెర విద్యాసాగర్రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు మాచర్ల వినయ్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.