రామడుగు, జూలై 18: అన్నదాతలకు అండగా నిలుస్తూ మూడు పంటలకు నీరు ఇస్తున్న సీఎం కేసీఆర్ కావాలో, మూడు గంటల కరెంటు చాలన్న కాంగ్రెస్ కావాలో రైతన్నలు తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని గోపాల్రావుపేట రైతు వేదికలో రైతులు, నాయకులతో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యాఖ్యలు చీకటి పాలనకు నిదర్శనంగా నిలుస్తున్నాయన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతులను రేవంత్రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు అవమానిస్తూ కేవలం మూడు గంటల కరెంటు సరిపోతుందని పేర్కొనడం వారి దుర్మార్గానికి అద్దం పట్టేలా ఉందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పాలన రైతుల ఉసురు తీసిందన్నారు. చిన్న, సన్నకారు రైతులు ఎందరో కాంగ్రెస్, టీడీపీ పాలనలో పంటలు చేతికి రాక అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. రామడుగు మండలం రాంచంద్రాపూర్ మాజీ సర్పంచ్ తిరుపతి తనకున్న వ్యవసాయ భూమిలో పది బోర్లు వేసినా చుక్క నీరు రాక తన పొలంలోనే ఆత్మహత్య చేసుకున్న ఘటన కన్నీళ్లను తెప్పిస్తుందన్నారు.
తెలంగాణ వస్తే మొత్తం చీకటైపోతదని పేర్కొన్న ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి, తెలంగాణ ఏర్పాటైతే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందని టీడీపీ నాయకుడు చంద్రబాబు మన పోరాటాలను అపహాస్యం చేశారన్నారు. నేటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తెలంగాణ వ్యతిరేకి చంద్రబాబు శిష్యుడన్నారు. చంద్రబాబుకు ఏజెంటుగా రేవంత్రెడ్డి తెలంగాణలో మాట్లాడుతున్నారనీ, తెలంగాణ రాష్ర్టాన్ని తిరిగి సమైక్య పాలనలోకి తీసుకెళ్లేందుకు పెద్ద కుట్ర నడుస్తోందన్నారు. వ్యవసాయానికి మూడు గంటల కరెంటు చాలని రేవంత్రెడ్డి అంటుంటే, అసలు కరెంటు అవసరమా అంటూ దయాకర్, సీతక్క మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. అపర భగీరథుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్బీఎస్ మండల కో-ఆర్డినేటర్ జూపాక కరుణాకర్, కొండగట్టు దేవస్థానం బోర్డు డైరెక్టర్ దాసరి రాజేందర్రెడ్డి, మాజీ ఎంపీపీ మార్కొండ కిష్టారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు ఎడవెల్లి నరేందర్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ చాడ ప్రభాకర్రెడ్డి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ జిల్లా సభ్యుడు తడగొండ నర్సింబాబు, తిర్మలాపూర్ సర్పంచ్ బక్కశెట్టి నర్సయ్య, ఏఎంసీ డైరెక్టర్లు మచ్చ గంగయ్య, కొలిపాక మల్లేశం, సోహైల్, శనిగరపు అర్జున్, బత్తిని తిరుపతిగౌడ్, నాయకులు కలిగేటి లక్ష్మణ్, చాడ శేఖర్రెడ్డి, గుండి ప్రవీణ్, సైండ్ల కరుణాకర్, సుద్దాల మల్లేశం, జుట్టు లచ్చయ్య, పూడూరి మల్లేశం, పైండ్ల శ్రీనివాస్, ఎడవెల్లి పాపిరెడ్డి, కర్ర శ్యాంసుందర్రెడ్డి, ముదుగంటి రాజిరెడ్డి, వేల్పుల హరికృష్ణ, పురాణం రమేశ్, లంక మల్లేశం, ఎడవెల్లి మల్లేశం, మినుకుల తిరుపతి, అజయ్, రాజు, ఆనంద్రెడ్డి, నిషాంత్ పాల్గొన్నారు.