పౌర్ణమి సందర్భంగా కొండగట్టు ఆంజనేయస్వామి క్షేత్రంలో గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని చిలుకూరులోని వేంకటేశ్వరస్వామి ఆలయ పూజారి ఆత్మరాం సురేశ్ మహరాజ్ నేతృత్వంలో నిర్వహించగా, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ దంపతులు ప్రారంభించారు.
ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అరుణాచలం తరహాలో కొండగట్టులో ఈ కార్యక్రమాన్ని చేపట్టి మూడోసారి నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు. తర్వాత స్వామివారి సన్నిధానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
– మల్యాల, జూలై 3