మానకొండూర్ రూరల్, సెప్టెంబర్ 11: వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. మానకొండూర్ మండలంలో ఆదివారం ఈదులగట్టెపల్లి, అన్నారం, లలితాపూర్, దేవంపల్లి, రంగపేట గ్రామాల్లో కల్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే స్వయం గావెళ్లి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆడబిడ్డలకు వరంగా కల్యాణలక్ష్మి, ఆపదలో ఉన్న వారికి అండగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందిస్తున్నట్లు తెలిపారు. లబ్ధిదారులు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్ గౌడ్, మానకొండూర్ ఎల్ఎస్సీఎస్ వైస్ ప్రెసిడెంట్ పంజాల శ్రీనివాస్ గౌడ్, సర్పంచులు మాధవరం రమ, మర్రి కొండయ్య, రొడ్డ పృధ్వీరాజ్, ఉప సర్పంచ్ బండారిపల్లి శ్రీనివాస్గౌడ్, నాయకులు ముద్దసాని శ్రీనివాస్రెడ్డి, మాధవరం దా మోదర్రావు, ఎరుకల శ్రీనివాస్గౌడ్, నెల్లిశంక ర్, బోయిని వెంకటేశ్, నాయకులు పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఉద్ఘాటించారు. మండలంలోని మొగిలిపాలెం గ్రామంలో ఉదయం బైక్పై పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు పలువురు తమ సమస్యలను విన్నవించుకున్నారు. అనంతరం పలువురికి మంజూరైన సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు.
వైద్య శిబిరం ప్రారంభం
కరీంనగర్లోని ఏషియన్ దవాఖాన వారు గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆయనకు వైద్యులు పరీక్షలు చేశారు. వ్యాధులు ప్రబలుతున్న సమయంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయడంపై దవాఖాన యాజమాన్యాన్ని ఎమ్మెల్యే అభినందించారు. గ్రామస్తులు సుమారు మూడు వందల మంది పరీక్షలు చేసుకోగా, డాక్టర్లు మందులు అందజేశారు. అనంతరం దవాఖాన యాజమాన్యం ఎమ్మెల్యేను సన్మానించారు. కా ర్యక్రమాల్లో మండలాధ్యక్షుడు రావుల రమేశ్, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్రెడ్డి, ఎంపీటీసీ పాశం తిలక్ప్రియ, ఆత్మ చైర్మన్ అశోక్రెడ్డి, నాయకులు పొన్నం అనిల్ గౌడ్, వరుకోలు సమ్మయ్య, నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు వీఆర్ఏల వినతి
రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్కు మండల వీఆర్ఏ సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. తమను పేస్కేల్ ఉద్యోగులుగా చేస్తానని సీఎం కేసీఆర్ గతంలో హామీ ఇచ్చారని, వీఆర్ఏల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడాలని విన్నవించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. సంఘం అధ్యక్షుడు గోనెల సంపత్, ప్రధాన కార్యదర్శి నాంపల్లి శ్రీనివాస్, వీఆర్ఏలు ఉన్నారు.
గ్రామాలకు వెళితే వృద్ధులను ఆప్యాయంగా పలుకరిస్తారు రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్. అలాగే ఆదివారం పర్యటనలో తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం గ్రామంలో ఇద్దరు వృద్ధులు వంగాల గౌరవ్వ, బామండ్ల కనుకవ్వలను కలిసి మాట్లాడారు. ‘పానమెట్లున్నది అవ్వా, పింఛన్ వస్తున్నదా.. కొడుకులు మంచిగ చూసుకుంటున్నరా’ అని వారిని ఆప్యాయంగా పలుకరించారు. ఈ సందర్భంగా వృద్ధులు ‘మమ్ములను పెద్ద కొడుకులెక్క చూసుకుంటున్న మీకే రుణపడి ఉంటం బిడ్డా’ అని ఎమ్మెల్యేను ఆశీర్వదించారు.