వేములవాడ, డిసెంబర్ 11: సిరిసిల్ల విద్యుత్ సహకార సంస్థ ఎన్నికల నేపథ్యం లో ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు మండలాల వారీగా కసరత్తు చేస్తున్నారు. వేములవాడ నియోజకవర్గం పరిధిలోని వే ములవాడ పురపాలక సంఘం, వేములవాడఅర్బన్, వేములవాడ రూరల్, చందుర్తి, కోనరావుపేట, రుద్రంగి మండలాలు ఉండ గా అభ్యర్థుల ఎంపికతో పాటు గెలుపే లక్ష్యం గా కసరత్తు చేస్తున్నారు.
రెండు రోజులుగా ఇప్పటికే అన్ని మండల పరిధిలోని ప్రజాప్రతినిధులు, పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు కార్యకర్తలతోసమావేశాలు నిర్వహించి అభిప్రాయాలు కూడా సేకరించారు. నిఖార్సయిన అభ్యర్థుల ఎంపికతో పాటు గెలుపే లక్ష్యంగా వ్యవహరించాల్సిన వ్యూహంపై కూడా చర్చించారు. ఈనెల 13 నుంచి నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమవుతుండగా అభ్యర్థుల ఎంపికలోనూ నేతల వారీగా చర్చించినట్లు సమాచారం. అన్ని స్థానాలను కైవసం చేసుకోవడమే కాకుండా సెస్ ప్రతిష్టను మరింత పెంచే విధంగా నడుచుకునే అభ్యర్థులపై కూడా పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.