వేదిక ఆధ్వర్యంలో ముద్రించిన చెకుముకి సైన్స్ సంబురాలకు సంబంధించిన గోడప్రతులను గంగాధర మండలం బూరుగుపల్లిలోని నివాసంలో శనివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, జనవిజ్ఞాన వేదిక సభ్యులు ప్రజల్లో మూఢనమ్మకాలను తొలగించి, చైతన్యవంతం చేయడం అభినందనీయమని కొనియాడారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు దోహదపడుతుందని తెలిపారు. జానవిజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ సభ్యుడు రామరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి సంపత్, రమేశ్, జిల్లా కార్యదర్శి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.