వీణవంక, డిసెంబర్ 28: తెలంగాణ ప్రభు త్వం ఆరు గ్యారంటీల అమలుకు ప్రవేశపెట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజలు సరైన విధంగా దరఖాస్తు చేసుకునేలా అధికారులు సహాయ, స హకారాలు అందించాలని హుజూరాబాద్ ఎమ్మె ల్యే పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని చల్లూరు, వీణవంక, హుజూరాబాద్ మండలం చెల్పూర్లో ప్రజాపాలన కార్యక్రమానికి పాడి కౌశిక్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, అధికారులకు, ప్రజలకు సూచనలు, సలహాలు అందజేశారు.
ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ప్రభుత్వం అమలు చేస్తామన్న ఆరు గ్యారంటీల పథకాలు ప్రజలకు అందేలా అన్ని రకాల సహాయ, సహకరాలు అందజేస్తామని ఎమ్మెల్యే అన్నారు. చల్లూరులో పది కౌంటర్లు ఏర్పాటు చేయగా 800 మం ది దరఖాస్తు చేసుకున్నట్లు, వీణవంకలో పది కౌంటర్లు ఏర్పాటు చేయగా 750 మంది దరఖాస్తులు అందజేసినట్లు ఎంపీడీవో శ్రీనివాస్, తహసీల్దార్ తిరుమల్రావు తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి జిల్లా వ్యవసాయశాఖ అధికారి శ్రీధర్రెడ్డి, మండల ఇన్చార్జి డీఈపీఆర్ మ హేశ్వర్, ఎంపీపీ ముసిపట్ల రేణుకాతిరుపతిరెడ్డి, జడ్పీటీసీ మాడ వనమాలసాదవరెడ్డి, సింగిల్విండో చైర్మన్ విజయభాస్కర్రెడ్డి, వైస్ ఎంపీపీ రాయిశెట్టి లతాశ్రీనివాస్, ఎంపీవో ప్రభాకర్, డీటీ శ్రీనివాస్రెడ్డి, సర్పంచులు నీల కుమారస్వామి, పొదిల జ్యోతి-రమేష్, ఎంపీటీసీ ఎలవేన సవితామల్లయ్య పాల్గొన్నారు.