హుజూరాబాద్ రూరల్, మే 2 : ప్రభుత్వ దవాఖానాల్లో కనీస వసతులు కల్పించాలని, మందుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి అధికారులకు సూచించారు. శనివారం పట్టణంలోని సిటీసెంటర్ హాల్లో నిర్వహించిన ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక – 90 రోజుల’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మిషన్ భగీరథ అమృత్ పథకం కింద మంజూరైన రూ.33 కోట్ల నిధులతో పనులను వెంటనే ప్రారంభించాలన్నారు.
అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని, ఎంపికలో ఎమ్మెల్యేను భాగస్వామ్యం చేయాలని సూచించారు. కేసీ క్యాంప్లోని ఆర్డీవో, ఎంవీఐ, ఎంజేపీ సూల్కు నల్లా కనెక్షన్, డైనేజీ లేకపోవడంపై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. వీణవంక మండలంలోని మామిడాలపల్లి-కోరల్, నాగంపేట్, బూజునూర్ రోడ్ల మరమ్మతులు తక్షణమే ప్రారంభించాలన్నారు. ఇల్లంతకుంటలో మకల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని ఆదేశించారు. జమ్మికుంట, హుజురాబాద్ మున్సిపాలిటీలకు మంజూరైన నిధులతో అభివృద్ధి పనులు ప్రారంభించాలన్నారు. కేసీఆర్ కిట్టు పథకాన్ని మళ్లీ ప్రారంభించాలని, లేదంటే పేరు మార్చి అయినా అమలు చేయాలని కోరారు.
హుజూరాబాద్ శివారులో ప్రతిపాదిత డంపింగ్ యార్డ్ను రద్దు చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం నేతన్న భద్రత పథకం కింద ఐదు కుటుంబాలకు ఒకొకరికి రూ.5 లక్షల చొప్పున రూ.25 లక్షలు అందజేశారు. ఆర్థిక పునరావాస పథకం కింద 2 కుటుంబాలకు ఒకొకరికి రూ.75 వేల చొప్పున మొత్తం రూ.1.50 లక్షలు అందజేశారు. ఏడుగురు అనాథ పిల్లలకు అనాథ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమలో ఆర్డీవో రమేశ్బాబు, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.