చొప్పదండి, ఫిబ్రవరి 5: నియోజకవర్గ కేంద్రంలో నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా రూ. 37.50 లక్షలతో చేపట్టిన వంద పడకల దవాఖాన భవన నిర్మాణానికి సోమవారం ఎమ్మె ల్యే మేడిపల్లి సత్యం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వంద పడకల దవాఖాన నిర్మాణం వల్ల చొప్పదండితో పాటు పకనున్న మండలాల ప్రజలకు కూడా ప్రభుత్వ వైద్యం చేరువవుతుందని తెలిపారు. పనులను వెంటనే ప్రారంభించి, త్వరగా అందుబాటులోకి తీసుకొస్తామని హా మీ ఇచ్చారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ నీరజాభూమారెడ్డి, జిల్లా దవాఖాన సమన్వయ అధికారి కృష్ణప్రసాద్, ఈఈ రవీ ందర్, ఎంపీపీ రవీందర్, జడ్పీటీసీ సౌజన్య, వైస్ చైర్పర్సన్ విజయలక్ష్మి పాల్గొన్నారు.