జ్యోతినగర్, నవంబర్ 5: స్వరాష్ట్రంలో ముదిరాజ్ కులస్తులకు సీఎం కేసీఆర్ సముచిత గౌరవం ఇచ్చి ఆదరించారని రామగుండం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందర్ అన్నారు. చెరువులపై హక్కులు కల్పించి, ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేసి వారి బతుకుల్లో వెలుగులు నింపారని కొనియాడారు. ఆదివారం రామగుండంలోని ఓ ఫంక్షన్హాల్లో ముదిరాజ్ మహాసభ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. మండలి డిప్యూటీ చైర్మన్, ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ ముదిరాజ్, ఎన్నికల ఇన్చార్జి నారాదాసు లక్ష్మణ్రావుతో కలిసి హాజరయ్యారు.
అనంతరం మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కాళేశ్వరం నిర్మించి గోదావరిని నిండుకుండాల మార్చడంతో ముదిరాజ్లకు ఉపాధి అవకాశాలు పెరిగాయని పేర్కొన్నారు. గోదావరి నదిలో యేటా లక్షలాది చేప, రొయ్య పిల్లలను వదిలి అభ్యున్నతికి బాటలు వేసిందని చెప్పారు.
తనను గెలిపిస్తే ముదిరాజ్లకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ముదిరాజ్లు ఆలోచించి కారు గుర్తుపై ఓటేయాలని కోరారు. ఇక్కడ రామగుండం బల్దియా మేయర్ డాక్టర్ అనిల్కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్రావు, నాయకులు అశోక్, ఎర్రం స్వామి, బండ్ల సత్తన్న, సాగంటి శంకర్, బొడ్డు రవీందర్, బాదరవేన స్వామి, మస్కం శ్రీనివాస్, జిట్టవేన ప్రశాంత్, ముడి సదయ్య, గోలుసు జ్యోతి, నాగరాజు, దండు రవీందర్ ఉన్నారు.
సీఎం కేసీఆర్ ముదిరాజ్ల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. చెరువులపై హక్కులు కట్టబెట్టారు. వృత్తిని నమ్ముకున్నవారికి బీమా సౌకర్యం కల్పించారు. ఐదెకరాల స్థలంలో రూ. 5 కోట్లు వెచ్చించి ఆత్మగౌరవ భవనం నిర్మించారు. ముదిరాజ్ బిడ్డనైనా తనకు క్యాబినెట్ హోదాతో మండలి డిప్యూటీ చైర్మన్గా అవకాశం ఇచ్చారు. మంచి పనులు చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరువద్దు, రామగుండం ఎమ్మెల్యేగా కోరుకంటిని అఖండ మెజార్టీతో గెలిపించాలి.
– శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్